AP Movie Theatres: సినిమా వివాదానికి జగన్ తెర
సినిమా టికెట్ల ధరలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది. థియేటర్లను ఏపీ సర్కార్ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
- By CS Rao Published Date - 09:15 PM, Mon - 7 March 22
సినిమా టికెట్ల ధరలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది. థియేటర్లను ఏపీ సర్కార్ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. చిన్నసినిమాలకు ఐదో షోలకు అవకాశం ఇచ్చింది. ఒక్కో థియేటర్లో రెండు రకాల టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. థియేటర్లలో కనీస టికెట్ ధర రూ.20 నుంచి గరిష్టంగా రూ. 250 వరకు నిర్ధారించింది ప్రభుత్వం. ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రీమియం, నాన్ ప్రీమియంగా ధరల
ను నిర్ధారించింది.
సినిమా టికెట్ల ధరలు కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.70, రూ.100గా ఉండనున్నాయి. అదేవిధంగా నాన్ ఏసీలో టికెట్ల ధరలు రూ.40, రూ. 60గా ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేషన్ స్పెషల్ థియేటర్లలో రూ. 100, రూ.125గా నిర్ణయించింది. కార్పొరేషన్ మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర రూ.150, రూ.250గా నిర్ణయించింది. మున్సిపాలిటీల్లో నాన్ ఏసీలో టికెట్ల ధరలు రూ.30, రూ.50లుగా ఉండనున్నాయి.
మున్సిపాలిటీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.80, రూ. 100గా నిర్ణయించింది. మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధరలు రూ.125, రూ.250గా నిర్ణయించింది. నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70గా నిర్ణయించింది. నగర పంచాయతీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.20 నుంచి రూ. 40 వరకు ఉండనున్నాయి. నగర పంచాయతీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.70, రూ.90గా ఉండనున్నాయి. నగర పంచాయతీల్లో మల్టిపెక్స్ ల్లో టికెట్ ధర రూ.100 నుంచి రూ. 250 వరకు నిర్ణయించింది.
ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి సినీ ప్రముఖులకు ఏపీ ప్రభుత్వానికి మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవితో సహా సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, పోసాని కృష్ణమురళి తదితరులు సీఎం జగన్ తో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమలో సమస్యలపై సీఎంతో చర్చించిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖుల అభ్యర్థనతో సీఎం జగన్ సినిమా టికెట్ల రేట్లపై కొత్త జీవో జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
సినిమా టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా సినిమా టికెట్స్ ధరలపై సినీ ప్రముఖులకు.. ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవితోపాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రభాస్.. ఎస్ఎస్ రాజమౌళి, పోసాని వంటి ప్రముఖులు ఏపీ సీఎం జగన్తో సమావేశమైన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని..త్వరలోనే సినిమా టికెట్స్ రేట్స్ పై జీవో జారీ చేయనున్నారని వేచి చూసారు. ఆ నేపథ్యంలోనే కొత్త జీవో జారీ అయింది.
Related News
CM Jagan: జగన్ `సినిమా` ఆట
బీమ్లా నాయక్ ను ఏపీ సీఎం జగన్ అడ్డంగా బుక్ చేశాడని అర్థం అవుతోంది.