AP Volunteer : మరో వాలంటీర్ ఘరానా మోసం బట్టబయలు..
వలంటీర్ కమ్ డ్వాక్రా గ్రూపు లీడర్ అయిన చాట్ల దివ్య తెలుసుకొని.. తన భర్త కిశోర్ను నాగేంద్రం బీమా ఖాతాకు నామినీగా
- By Sudheer Published Date - 02:13 PM, Wed - 30 August 23
ఏపీలో వాలంటీర్ల (AP Volunteer ) దారుణాలు ఆగడం లేదు..ఓ పక్క ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల మోసాలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి. వ్యక్తి గత చోరీలకు పాల్పడుతున్నారని, హత్యలు చేస్తున్నారని, ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారని , దోపిడీలకు పాల్పడుతున్నారని గగ్గోలు పెడుతున్నప్పటికీ..రాష్ట్రంలో వాలంటీర్లు మాత్రం వారి ఆగడాలను ఆపడం లేదు. ప్రతి రోజు ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే చాల దారుణాలు బయట పడగ..తాజాగా ప్రకాశం (Prakasam District) జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తిలో మరో దారుణానికి పాల్పడింది ఓవాలంటీర్ మహిళ.
వివరాల్లోకి వెళ్తే..
కనపర్తి గ్రామానికి చెందిన చాట్ల నాగేంద్రం (Chatla Naagendram) అనే మహిళ.. డ్వాక్రా గ్రూపు సభ్యురాలు. భర్త కు దూరంగా అదే గ్రామంలో తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తుంది. కాగా కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. కాగా ఈమె బీమా సర్వేలో కొంత ఏమౌట్ దాచుకుంది. ఈ విషయాన్ని వలంటీర్ కమ్ డ్వాక్రా గ్రూపు లీడర్ అయిన చాట్ల దివ్య తెలుసుకొని.. తన భర్త కిశోర్ను నాగేంద్రం బీమా ఖాతాకు నామినీగా చేర్చాలని అనుకుంది. ఈమేరకు సచివాలయ ఉద్యోగి సహాయంతో తన భర్తను నామినీగా పేరు మార్చేశారు. ఆరోగ్యం బాగా లేని నాగేంద్రం కొంతకాలానికి మృతిచెందారు.
తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆమె డెత్ సర్టిఫికెట్ను వలంటీర్ దివ్య తీసుకుని మండల వెలుగు కార్యాలయానికి అదించింది. దీంతో వెంటనే బీమా సొమ్ము రూ.లక్ష కిశోర్ ఖాతాలో జమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నాగేంద్రం సోదరుడు చాట్ల పుల్లయ్య.. వలంటీర్ చేసిన మోసంపై ఎంపీడీఓ జయమణికి ఫిర్యాదు చేశారు. బీమా సొమ్మును తన తల్లి చాట్ల సమాధానంకు ఇప్పించాలని కోరారు. అలాగే దివ్యతో పాటు, డిజిటల్ అసిస్టెంట్పైనా క్రిమినల్ కేసులు పెట్టి, వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Read Also : AP: రాఖీ పర్వదినాన..ఆడవారికి రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్
Related News
AP : ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్ల దాడి
Lavu Sri Krishnadevaraya: ఏపిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్(General Election Polling) సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రికత్త పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే పల్నాడు జిల్లా నరసరావు పేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్లదాడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు రావటానికి వీలులేదని వైసీపీ వర్గీయులు వారించగా.. వచ్చే హక్కు ఉందని �