Vijayawada: రోడ్డుపై మందుబాబుల అడ్డా.. రాకపోకలు సాగేదెలా!
ఆ రోడ్డు నిత్యం ప్రయాణికులు, బాటసారులతో రద్దీగా ఉంటుంది. అంతే కాదు.. ఇతర ప్రధాన మార్గాలకు కేంద్రం బిందువు కూడా.
- By Balu J Published Date - 03:28 PM, Wed - 16 March 22
ఆ రోడ్డు నిత్యం ప్రయాణికులు, బాటసారులతో రద్దీగా ఉంటుంది. అంతే కాదు.. ఇతర ప్రధాన మార్గాలకు కేంద్రం బిందువు కూడా. పైగా చారిత్రాత్మకమైన మొఘల్రాజపురం జంక్షన్ కూడా. విజయవాడలో రద్దీగా ఉండే ఆ ప్రాంతం పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యంబాబులు హల్ చల్ చేస్తుంటారు. ఆ ప్రాంతాలనే బార్ టేబుల్స్ గా ఉపయోగించకుంటూ దర్జాగా మందు తాగుతుంటారు. అయితే స్థానికులు సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి.
“మద్యం తాగేవాళ్లు మా ప్రాంతంలో ప్రతిరోజూ నిలబడి మద్యం సేవించడం పెద్ద ఇబ్బందిగా మారింది. రెసిడెన్షియల్ కాలనీవాసులతో పాటు విద్యాసంస్థలు విద్యార్థులు అటువైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. లక్షలాది మంది ప్రయాణించే రహదారిపై వైన్ షాపును అధికారులు ఎలా అనుమతించగలరనేది ఆశ్చర్యంగా ఉంది’’ అని స్థానికుడు కె. జాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రోడ్డు పక్కన మందు తాగడమే కాకుండా, బాటిళ్లు, గ్లాసులతో సహా ఇతర చెత్తను అక్కడే వదిలేస్తున్నారు. మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేసిన తర్వాత బహిరంగంగా మద్యం సేవించడంతో నగరంలోని మరికొన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రభుత్వాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Related News
AP : ఏపిలో మనం చరిత్ర సృష్టించబోతున్నాం: ఐప్యాక్ టీంతో సీఎం జగన్
CM Jagan: సిఎం జగన్ విజయవాడ(Vijayawada)లోని ఐప్యాక్ కార్యాలయా(IPAC office)ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ ఐప్యాక్ బృందంతో(IPAC team) మాట్లాడుతూ.. ఏపిలో వైసీపీ(YCP) కొత్త చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. ఎన్నికల తరువాత తొలి సారి ఫలితాల పై స్పందించారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. అంతేకాదు.. ప్రశాంత్ కిషోర్ అంచనా వేయని