Amit Shah: సాయి గణేష్ కుటుంబసభ్యులకు అమిత్ షా పరామర్శ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మతో ఫోన్లో మాట్లాడారు.
- Author : Balu J
Date : 19-04-2022 - 9:17 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మతో ఫోన్లో మాట్లాడారు. సాయిగణేష్ ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలని సావిత్రమ్మ, కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారం. కుటుంబానికి బీజేపీ అన్నివిధాలా అండగా ఉంటుందని అమిత్ షా కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా సాయి గణేష్ కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు.