Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఆ మార్గంలో నెలరోజులు ట్రాఫిక్ ఆంక్షలు
- By Balu J Published Date - 10:20 AM, Sat - 6 April 24
Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 5 నుండి మే 4 వరకు 30 రోజుల పాటు నారాయణగూడ పరిధిలో ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామ్కోట్ రోడ్డు, కింగ్ కోటి రోడ్డు మార్గంలో పైపులైన్ల పనులు కొనసాగుండటం కూడా ఆంక్షలు విధించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. రామ్ కోటి నుండి ఈడెన్ గార్డెన్ ఎక్స్ రోడ్కు వెళ్లే ట్రాఫిక్ను అవసరమైతే వన్-వేకి అనుమతిస్తారు. అయితే, కింగ్ కోటి ఎక్స్ రోడ్ నుండి ఈడెన్ గార్డెన్స్ మీదుగా రాంకోటి ఎక్స్ రోడ్ వరకు ట్రాఫిక్ అనుమతించబడదు.
ఈడెన్ గార్డెన్స్ ఎక్స్ రోడ్స్ వద్ద స్మశానవాటిక, నారాయణగూడ వైపు మళ్లించబడుతుంది. నారాయణగూడ శ్మశానవాటిక రోటరీ నుంచి ఈడెన్ గార్డెన్ ఎక్స్ రోడ్ మీదుగా రామ్కోటి వైపు వచ్చే ట్రాఫిక్ను అనుమతించరు, వాటిని కింగ్కోటి ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. పోలీసులు పౌరులు పైన పేర్కొన్న పనులను గమనించి, వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిగణించాలని అభ్యర్థించారు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్లైన్ 9010203626కు కాల్ చేయాలని అభ్యర్థించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిషేధిత మార్గాల్లో ట్రాఫిక్ను నియంత్రించడంలో ప్రజల సహకారాన్ని కోరుతున్నారు.
Related News
Amit Shah ‘Deepfake’ Video Case: ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్తోపాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.