Aftab Poonawala : బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోనున్న అఫ్తాబ్?
సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు (Shraddha Walkar Murder Case)లో నిందితుడు
- By Maheswara Rao Nadella Published Date - 05:30 PM, Sat - 17 December 22
సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు (Shraddha Walkar Murder Case)లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా (Aftab Poonawala) బెయిలు పిటిషన్ (Bail Petition)పై విచారణ ఈనెల 22న జరుగనుంది. అఫ్తాబ్ పోలీసు కస్టడీ శనివారంతో ముగియనుండటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు అడిషనల్ జడ్జి వ్రిందా కుమారి ముందు అతన్ని పోలీసులు హాజరుపరిచారు. వకాల్తానామాపై తాను సంతకం చేశానని, అయితే తన తరఫున బెయిల్ దాఖలు అయినట్టు తెలియదని అఫ్తాబ్ కోర్టుకు తెలిపాడు.
బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నావా అని జడ్జి వెంటనే ప్రశ్నించారు. ఇందుకు అఫ్తాబ్ పూనావాలా (Aftab Poonawala) సమాధానమిస్తూ, న్యాయవాది తనతో మాట్లాడాలని కోరుకుంటున్నానని, అప్పుడు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకుంటానని చెప్పాడు. దీంతో బెయిలు అప్లికేషన్ను పెండింగ్లో ఉంచుతున్నట్టు జడ్జి ప్రకటించారు. దీనికి ముందు అఫ్తాబ్ బెయిల్ అప్లికేషన్పై సాకేత్ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టి, నిందితుడి నుంచి క్లారిఫికేషన్ అవసరమని పేర్కొంది. కౌన్సిల్తో కమ్యూనికేషన్ లేకుండానే పొరపాటున బెయిల్ అప్లికేషన్ ఫైల్ అయినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వాదనను న్యాయవాది కొట్టివేశారు.
Also Read: Khushboo : ఖుష్బూ ఇంట విషాదం. ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్ మృతి
Related News
Maldives : దౌత్య పరమైన విభేదాలు..భారత పర్యటనకు రానున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి
India and Maldives: భారత్ , మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే “మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మే 9న అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. మాల్దీవుల చైనా అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాల్దీవుల విదేశాంగ మంత్రి మూస�