Adilabad: చలి గుప్పిట్లో ఆదిలాబాద్ జిల్లా, పొగమంచుతో రాకపోకలకు బ్రేక్
తుపాన్ ఫ్రభావంతో పలు జిల్లాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
- By Balu J Published Date - 04:10 PM, Fri - 8 December 23
Adilabad: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో చల్లటి పొగమంచుతో కూడిన వాతావరణం నెలకొంది. దట్టమైన పొగమంచు కారణంగా హైవేలపై వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెలుతురు సరిగ్గా లేకపోవడంతో రాకపోకలపై ఎఫెక్ట్ పడింది. డ్రైవర్లు హెడ్లైట్లు వేసుకొని ప్రయాణం చేయాల్సివస్తోంది. జాతీయ రహదారులపై దట్టమైన పొగమంచు ఉండటంతో వాహనదారులు స్లో ప్రయాణం చేస్తున్నారు. ఇక ఉదయం, రాత్రి సమయంలో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికకులు అంటున్నారు.
తెలంగాణ స్టేట్ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ (టిఎస్పిడిఎస్) ప్రకారం.. ఆదిలాద్ జిల్లాలోని పొచ్చర, నార్నూర్ మరియు బజార్హత్నూర్లో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లాలోనూ దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఇదే పరిస్థితి నెలకొంది. ఇండోర్ పట్టణంలో, ఉదయం 8 గంటలకు, దట్టమైన పొగమంచు చాలా తీవ్రంగా ఉండటంతో జనాలు ఇళ్లకు పరిమితమయ్యారు.
Related News
KTR: బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ మాట నేను చెప్పడం లేదని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు చెబుతున్నారని ఆయన అన్నారు.