5 Killed : మేఘాలయ టీఎంసీ ర్యాలీలో అపశృతి.. జీపు బోల్తా పడి ఐదుగురు మృతి
మేఘాలయలో టీఎంసీ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీలోని ఓ జీపు బోల్తా పడి ఐదుగురు మృతి చెందగా, 21 మంది
- By Prasad Published Date - 06:59 AM, Tue - 21 February 23
మేఘాలయలో టీఎంసీ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీలోని ఓ జీపు బోల్తా పడి ఐదుగురు మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు సోమవారం మేఘాలయలోని నార్త్ గారో హిల్స్లో ఈ ఘటన జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బొల్మెడంగ్లో టీఎంసీ ర్యాలీ జరుగుతోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం అస్సాంలోని గోల్పరా ఆసుపత్రికి తరలించామని నార్త్ గారో హిల్స్ పోలీస్ చీఫ్ శైలేంద్ర బమానియా తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా ప్రసంగించే ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు జీపులో ఉన్నవారు అడోగ్రే గ్రామానికి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Tags
Related News
Singer Mangli: సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. డీసీఎం కారును ఢీకొట్టడంతో!
తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈమె వెండితెరపై, అలాగే బుల్లితెరపై అవకాశాలతో దూసుకుపోతున్నా విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెండితెరపై వరుసగా పాటలను పాడుతూ భారీగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అందుకు తగ్గట్టుగానే భారీగా పారితోషికాన్ని కూడా అందుకుంటోంది మంగ్లీ. ఈమె ఏ సినిమాలో పాట పాడిన కూడా తనకంటూ ఒక