TCongress: లండన్ లో ఆరు-నూరు కార్యక్రమం: టీపీసీసీ ఎన్నారై సెల్
- By Balu J Published Date - 04:28 PM, Sat - 21 October 23
TCongress: ఆరు గ్యారంటీ పధకాలు -నూరు గ్యారంటీ సీట్ల లక్ష్యం తో టీపీసీసీ ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని లండన్ లో ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమం కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు పాల్గొని ఎన్నారై లకు ఎన్నికల దృష్ట్యా మార్గదర్శకం చేశారు.
కాంగ్రెస్ పార్టీ యువత, మహిళ, రైతు కి ఇవ్వబోయే వివిధ సంక్షేమ పధకాలు వివరించారు, విద్యార్థుల కోసం ₹5 లక్షల ATM కార్డు, ₹10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకం, మహిళ కి ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వం లోకి రాగానే మెగా DSC ఏర్పాటు చేసి, ఏక కాలం లో భారీ సంఖ్య లో ఉద్యోగ భర్తీ నింపడం వంటి పధకాలు వివరించారు. గల్ఫ్ సంక్షేమం బోర్డు, ఎన్నారై సెల్ ఏర్పాటు పై మేనిఫెస్టో లో పొందుపరిచే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో కో కన్వీనర్ లు రంగుల సుధాకర్ గౌడ్, రాకేష్ బిక్కుమండ్ల, మంగళారపు శ్రీధర్ అడ్వైజరరీ బోర్డు సభ్యులు గంగసాని ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి శ్రీధర్ నీలా, మహిళా విభాగం కో ఆర్డినేటర్ మేరీ, టీపీసీసీ ఎన్నారై సెల్ సభ్యులు శ్రీనివాస్, అజయ్, కళ్యాణ్, సయ్యద్, సాయి, తదితరులు 50 మంది సభ్యులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో 6 గ్యారంటీ పధకాలతో ప్రజల్లోకి వెళ్లి 100 సీట్లు గెలిచే లక్ష్యం తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
Related News
JP Nadda: అయోధ్య రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది!
JP Nadda: కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎఐఎంఐఎం ముస్లిం లీగ్ ఎజెండాను అనుసరిస్తున్నాయని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం ఆరోపించారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మైనార్టీల మద్దతుదారులని, మూడు పార్టీలు రజాకార్ల మద్దతుదారులని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్�