Rajasthan: బీకామ్ డ్రాప్ ఔట్.. దోశలు వేస్తూ ఏడాదికి రూ.50 లక్షలు సంపాదన?
ఇష్టపడి పని చేస్తే ఆదాయం తో పాటు ఆనందం కూడా లభిస్తుంది అని అంటూ ఉంటారు. అందుకు చక్కటి ఉదాహరణ
- By Nakshatra Published Date - 06:29 PM, Fri - 4 November 22
ఇష్టపడి పని చేస్తే ఆదాయం తో పాటు ఆనందం కూడా లభిస్తుంది అని అంటూ ఉంటారు. అందుకు చక్కటి ఉదాహరణ రాజస్థాన్ కు చెందిన రాజేంద్ర. బీకాం చదువును మధ్యలో వదిలేసిన రాజేంద్ర దోశలు వేసుకుంటూ ఏడాదికి 50 లక్షలు సంపాదిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ జోధ్ పూర్ జిల్లాకు చెందిన రాజేంద్ర 2020లో బీకాం చదువును మధ్యలో ఆపేసి సొంతంగా వ్యాపారం చేయాలి అనుకున్నాడు. ఈ మేరకు తన మిత్రుల సలహాతో బెంగళూరులోని లింగ రాజపురం వెళ్లి అక్కడ సౌత్ ఇండియన్ పెళ్లిళ్లలో పెళ్లిళ్లలో క్యాటరింగ్ లో పనిచేశాడు.
ఈ క్రమంలోనే దోశల్లో వివిధ రకాల దోశల గురించి తెలుసుకున్నాడు. అప్పుడు సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఇంటికి వచ్చి 2022 నుంచి తోపుడు బండిపై రకరకాల దోశలు వేయడం ప్రారంభించాడు. ఖవాన్ ఖండ్ నగరంలోని సర్దార్ పుర్ చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతంలో రోజు సాయంత్రం దోశలు వేయడం మొదలుపెట్టాడు. సాయంత్రం అయింది అంటే చాలు రాజేంద్ర దోశల బండి దగ్గర దోసెల కోసం క్యూ కడుతూ ఉంటారు. రోజు రోజుకి కస్టమర్స్ ఎక్కువ అవ్వడంతో దోసెలలో కొత్త పద్ధతిని అవలంబిస్తూ సౌత్ ఇండియన్ డిష్ కి వెస్ట్రన్ ని మిక్స్ చేసి కొత్త రకం దోశలు వేయడం ప్రారంభించాడు.
అలా పిజ్జా దోశ, జెనీ దోశ, పావు బాజీ కాంబినేషన్ దోశ ఇలా మొత్తం 99 రకాల దోశలు వేయడం మొదలు పెట్టాడు రాజేంద్ర. ఇందులో ఎక్కువగా పిజ్జా దోశకి వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తుంటాయి అని రాజేంద్ర తెలిపాడు. గ్యాస్ స్టవ్ పై వండిన దోశ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని అందుకే ఇనుప పొయ్యి బొగ్గుల పై దోశలు వేయడం ప్రారంభించామని ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా రావు అని రాజేంద్ర చెబుతున్నాడు. అంతేకాకుండా పెళ్లిళ్ల సీజన్లలో రాజేంద్రకు విపరీతమైన ఆర్డర్లు కూడా వస్తూ ఉంటాయని తెలిపాడు. అలా దోశలు వేసుకుంటూ రాజేంద్ర ఏడాదికి 45 నుంచి 50 లక్షల వరకు సంపాదిస్తున్నాడట.
Related News
PM Modi: అంబేడ్కర్ మళ్లీ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు: మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ దేశ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని సోనియా గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.