HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >A Young Man From Rajasthan Is Earning Rs 50 Lakhs A Year By Doing Dosa Business After Dropping Out Of Bcom

Rajasthan: బీకామ్ డ్రాప్ ఔట్.. దోశలు వేస్తూ ఏడాదికి రూ.50 లక్షలు సంపాదన?

ఇష్టపడి పని చేస్తే ఆదాయం తో పాటు ఆనందం కూడా లభిస్తుంది అని అంటూ ఉంటారు. అందుకు చక్కటి ఉదాహరణ

  • By Anshu Published Date - 06:29 PM, Fri - 4 November 22
  • daily-hunt
Rajastan
Rajastan

ఇష్టపడి పని చేస్తే ఆదాయం తో పాటు ఆనందం కూడా లభిస్తుంది అని అంటూ ఉంటారు. అందుకు చక్కటి ఉదాహరణ రాజస్థాన్ కు చెందిన రాజేంద్ర. బీకాం చదువును మధ్యలో వదిలేసిన రాజేంద్ర దోశలు వేసుకుంటూ ఏడాదికి 50 లక్షలు సంపాదిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ జోధ్ పూర్ జిల్లాకు చెందిన రాజేంద్ర 2020లో బీకాం చదువును మధ్యలో ఆపేసి సొంతంగా వ్యాపారం చేయాలి అనుకున్నాడు. ఈ మేరకు తన మిత్రుల సలహాతో బెంగళూరులోని లింగ రాజపురం వెళ్లి అక్కడ సౌత్ ఇండియన్ పెళ్లిళ్లలో పెళ్లిళ్లలో క్యాటరింగ్ లో పనిచేశాడు.

ఈ క్రమంలోనే దోశల్లో వివిధ రకాల దోశల గురించి తెలుసుకున్నాడు. అప్పుడు సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఇంటికి వచ్చి 2022 నుంచి తోపుడు బండిపై రకరకాల దోశలు వేయడం ప్రారంభించాడు. ఖవాన్ ఖండ్ నగరంలోని సర్దార్ పుర్ చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతంలో రోజు సాయంత్రం దోశలు వేయడం మొదలుపెట్టాడు. సాయంత్రం అయింది అంటే చాలు రాజేంద్ర దోశల బండి దగ్గర దోసెల కోసం క్యూ కడుతూ ఉంటారు. రోజు రోజుకి కస్టమర్స్ ఎక్కువ అవ్వడంతో దోసెలలో కొత్త పద్ధతిని అవలంబిస్తూ సౌత్ ఇండియన్ డిష్ కి వెస్ట్రన్ ని మిక్స్ చేసి కొత్త రకం దోశలు వేయడం ప్రారంభించాడు.

అలా పిజ్జా దోశ, జెనీ దోశ, పావు బాజీ కాంబినేషన్ దోశ ఇలా మొత్తం 99 రకాల దోశలు వేయడం మొదలు పెట్టాడు రాజేంద్ర. ఇందులో ఎక్కువగా పిజ్జా దోశకి వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తుంటాయి అని రాజేంద్ర తెలిపాడు. గ్యాస్ స్టవ్ పై వండిన దోశ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని అందుకే ఇనుప పొయ్యి బొగ్గుల పై దోశలు వేయడం ప్రారంభించామని ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా రావు అని రాజేంద్ర చెబుతున్నాడు. అంతేకాకుండా పెళ్లిళ్ల సీజన్లలో రాజేంద్రకు విపరీతమైన ఆర్డర్లు కూడా వస్తూ ఉంటాయని తెలిపాడు. అలా దోశలు వేసుకుంటూ రాజేంద్ర ఏడాదికి 45 నుంచి 50 లక్షల వరకు సంపాదిస్తున్నాడట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dosa
  • dosa business
  • earn 50 lakhs
  • rajasthan

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd