New Parliament Building: నెట్టింట వైరల్ అవుతున్న పార్లమెంట్ నూతన భవనం ఫోటోస్?
భారతదేశ పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమయ్యింది. కాగా మే 28వ తేదీన ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ చారిత్రక భవనాన్ని ప
- By Nakshatra Published Date - 08:50 PM, Fri - 26 May 23
భారతదేశ పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమయ్యింది. కాగా మే 28వ తేదీన ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ చారిత్రక భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రెండు దశలుగా జరగనుంది. మొదట పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఆ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరూ లోక్ సభ రాజ్యసభ ప్రాంగణాలను పర్యవేక్షించనున్నారు. అలాగే కార్యక్రమంలోని రెండో భాగం రాజ్యసభ ఛాంబర్ లో జాతీయ గీతాలాపనతో మధ్యాహ్నం ప్రారంభం కానుంది.
ఈ చారిత్రక భవనాన్ని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదునాతన హంగులతో కేవలం రెండేళ్ల వ్యవదిలోనే ఈ భవనం నిర్మించారు. కేవలం మరో రెండు రోజుల్లో ఈ భవనం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే తాజాగా పార్లమెంటు భవనం వీడియోని దేశ ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు.
నూతన పార్లమెంటు భవనం భారతీయ పౌరులందరూ గర్వించేలా ఉంటుంది అని తెలిపారు. కాగా ఆ వీడియోలో ఈ చారిత్రక భవనంలోని సమావేశం మందిరాలు లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేక చిహ్నాలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Related News
KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర
KTR: వచ్చే లోక్సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకసభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు అవసరమైన మెజారిటీ సాధించకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు కేటిఆర్. ఈ రోజు శుక్�