Shashikala Died: రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కున్న అమ్మాయి మృతి
విశాఖలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కునిపోయిన అమ్మాయి చనిపోయింది.
- By Balu J Published Date - 04:04 PM, Thu - 8 December 22
విశాఖలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కునిపోయి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని శశికళ మృతి చెందింది. ప్లాట్ ఫాం పగులగొట్టి ఆమెను కాపాడే సమయానికి బ్లాడర్, నడుం భాగం ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ విద్యార్థినిని షీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. దాంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీయే చదువుతోంది. ఆమె మరణవార్తలో కాలేజీలో విషాద వాతావరణం నెలకొంది.
కంపార్ట్ మెంట్ నుంచి కిందికి దిగే ప్రయత్నంలో వెనుక నుంచి డోర్ బలంగా ఢీకొనడంతో శశికళ ప్రమాదవశాత్తు కిందికి జారిపోయింది. రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకుని గంటల కొద్దీ నరకయాతన చవిచూసింది. రైల్వే రెస్క్యూ టీం స్పందించి ప్లాట్ ఫాంను పగులగొట్టినా, అప్పటికే ఆమెకు అంతర్గతంగా తీవ్ర గాయాలయ్యాయి.
Really a Great job by #RailwayRPF staff, Rescued a lady passenger who caught in between Compartment coach and Platform today while De-boarding at #Duvvada Station . She was saved by breaking the platform carefully and was shifted to nearby Hospital. #Vizag 🙌 pic.twitter.com/NjKJGyrYip
— VIZAG WEATHERMAN 🇮🇳 (@VizagWeather247) December 7, 2022
Tags
Related News
Summer: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సమ్మర్ రాకపోకల కోసం ప్రత్యేక రైళ్లు
Summer: వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ – సికింద్రాబాద్, గోరక్పూర్-మహబూబ్నగర్, మహబూబ్నగర్ – గోరక్పూర్, కొచ్చువెలి-షాలిమార్, షాలిమార్-కొచ్చువెలి, బెంగళూరు-ఖరగ్పూర్, భువనేశ్వర్-యెహలంక, హుబ్బళ్లి-గోమతినగర్, తిన్సుకియా-బెంగళూరు, జబల్పూర్-కన్యాక�