Fake Doctor: వృద్ధురాలిని మోసం చేసిన నకిలీ డాక్టర్.. మత్తుమందు ఇచ్చి ఆపై అలా?
సమాజంలో రోజురోజుకీ నకిలీ డాక్టర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకమైన ప్రజల జీవితాలతో ఆటాడుతున్నారు. కొందరు డాక్టర్లు అనే పేరు చెప్పుకుంటూ న
- By Nakshatra Published Date - 03:53 PM, Thu - 8 June 23
సమాజంలో రోజురోజుకీ నకిలీ డాక్టర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకమైన ప్రజల జీవితాలతో ఆటాడుతున్నారు. కొందరు డాక్టర్లు అనే పేరు చెప్పుకుంటూ నకిలీ డాక్టర్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే గతంలో చాలామంది నకిలీ డాక్టర్లు బాగోతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా కూడా వ్యక్తి డాక్టర్ ని అని నమ్మించి వృద్ధురాలిని దారుణంగా మోసం చేశాడు. అసలేం జరిగిందంటే..
ఒక వ్యక్తి రైల్లో ప్రయాణిస్తూ ఉండగా అతనితో పాటు పక్కన ఒక వృద్ధురాలు కూడా ఉంది. ఇక రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఆ వృద్ధురాలతో మాట మాట కలిపాడు. అనారోగ్యం గురించి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఆమెకున్న జబ్బును నయం చేస్తాను అంటూ మాయ మాటలు చెప్పాడు. దాంతో ఆ వృద్ధురాలు ఆ నకిలీ డాక్టర్ మాటలు నిజమే అని నమ్మింది. రైలు దిగిన వెంటనే వృద్ధురాలికి చికిత్స చేస్తానంటూ మాయమాటలు చెప్పి ఒక లాడ్జికి తీసుకెళ్లాడు. లార్జీకి వెళ్ళిన తర్వాత కొన్ని మందులు ఇవ్వడంతో అవి వేసుకున్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది.
ఇక అదే అదునుగా భావించిన సదరు నకిలీ డాక్టర్ ఆ వృద్ధురాలు ఒంటిపై ఉన్న బంగారంతో పాటు డబ్బులు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటికి బాధితురాలికి వచ్చి చూడగా తన మెడలో ఉన్న బంగారు గొలుసు లేకపోవడంతో కేటుగాడు తనను మోసం చేశారని గుర్తించి వెంటనే గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ప్రస్తుతం నకిలీ డాక్టర్ పరారీలో ఉన్నాడు.
Related News
Lok Sabha Polls: హైదరాబాద్ లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం..!
ప్రస్తుతం దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలింగ్ జరగగా.. తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన ఎలక్షన్స్ జరగనున్నాయి.