Ganja Seized : ఖమ్మం జిల్లాలో 63 కేజీల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్
ఖమ్మం జిల్లాలో 63 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామంలో గంజాయిని కలిగి ఉన్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు
- By Prasad Published Date - 09:51 PM, Wed - 13 July 22
ఖమ్మం జిల్లాలో 63 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామంలో గంజాయిని కలిగి ఉన్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఐదుగురు వ్యక్తుల నుంచి సుమారు 63 కిలోల గంజాయిని స్వాధీనం, ఒక ద్విచక్ర వాహనం, కారు కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
పక్కా సమాచారంతో కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ కొప్పుల సతీష్, సబ్ ఇన్స్పెక్టర్ నందీప్ ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తుండగా వెంకటేశ్, నవీన్, శ్రీనివాస్, రమేష్, శ్రీరామ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహబూబాబాద్ జిల్లా నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. వారిని బుధవారం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
Tags
Related News
Hyderabad: 4 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్
Hyderabad: సైబరాబాద్ SOT పోలీసులు రాజమండ్రి కి చెందిన యువకులైన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని 4.2 లక్షల విలువ చేసే MDM మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ SOT మదాపూర్ టీం కాటూరి సూర్య కుమార్, గుత్తుల శ్యామ్ బాబు పట్టుకుని 4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల MDMA మత్తు పదార్థాన్ని, 2 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. సూర్య కుమార్ 2017లో ఉన్నత చదు�