Road Accident: యూపీలో స్కూల్ బస్సు-వ్యాన్ ఢీ: ఆరుగురు మృతి: Video
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘజియాబాద్లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై బస్సు మరియు వ్యాన్ ఢీకొన్నాయి.
- By Praveen Aluthuru Published Date - 09:40 AM, Tue - 11 July 23
Road Accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘజియాబాద్లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై బస్సు మరియు వ్యాన్ ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరియు ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
If this school bus driver is still alive, then he should be booked and tried for murder.
He’s killed 6 people in the TUV because of his misadventures of driving against the flow of traffic on Delhi-Meerut Expressway. pic.twitter.com/GZe5wTJY8N
— Yo Yo Funny Singh (@moronhumor) July 11, 2023
పోలీసుల సమాచారం ప్రకారం…విజయ్ నగర్ మరియు తిగ్రీ మధ్య ఎక్స్ప్రెస్వేపై పాఠశాల బస్సు మరియు వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సు ఖాళీగా ఉంది. స్కూల్ బస్సు రాంగ్ రూట్లో వచ్చి ఎదురుగా వస్తున్న వ్యాన్ ను బలంగా ఢీ కొట్టింది. దీంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో అమాయకులు మృతి చెందడం బాధాకరం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పిల్లలు ఉంటే పెను ప్రమాదం జరిగే ఉండేదని స్థానిక ప్రజలు చెప్తున్నారు. కాగా ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More: Andhra Prdesh : ప్రకాశం జిల్లా బస్సు ప్రమాదం పై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి
Related News
Gopalganj Accident: బీహార్లో ఆర్మీ వెహికిల్ ప్రమాదం: ఇద్దరు జవాన్లు మృతి
బీహార్లోని గోపాల్గంజ్లో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా డజనుకు పైగా సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన సిధ్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హిమా మలుపు దగ్గర జరిగింది