TDP:టీడీపీ రావడం ఒక రాజకీయ అనివార్యం…చంద్రబాబు..!!!
టీడీపీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
- By Hashtag U Published Date - 11:34 AM, Tue - 29 March 22
టీడీపీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
40 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం..ఒక రాజకీయ అనివార్యం. కొందరు వ్యక్తుల కోసమే..పదవుల కోసమే టీడీపీ ఏర్పండి కాదు. ప్రజల కోసం…ప్రజల ఆకాంక్షలు నుంచి పుట్టిన పార్టీ ఇది. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం. ఈ 40 ఏళ్ల కాలంలో సామాన్య ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువచ్చింది. కొందరికే పరిమితమైన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది. టీడీపీ అంటేనే అభివృద్ధి.. సంక్షేమం. సంస్కరణల ఫలితాలను గ్రామస్థాయికి అందించిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబునాయుడు అన్నారు. పాలనపై పాలకులు ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది కూడా తెలుగుదేశంపార్టీనే. చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకు తెచ్చేలా టీడీపీ 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలన్నారు.
పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ శుభాకాంక్షలు తెలిపార. 40 వసంతాల పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేవుడు ఎన్టీఆర్, రాముడు చంద్రబాబు…వీరే ధైర్యం. కార్యక్తలే బలం…జెండానే పవర్. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది మా తాత ఎన్టీఆర్. అభివ్రుద్ధి చేసింది మా నాన్న . అధికారం ఉన్నా లేకున్నా ప్రతిక్షణం ప్రజలు గురించి ఆలోచించేది టీడీపీ మాత్రమే. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేద్దామని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలోని 200 నగరాలలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటున్న ప్రవాసాంధ్రులకు పార్టీ అధినేత @ncbn గారు అభినందనలు తెలిపారు. విదేశాలలో ఉన్న తెలుగువారికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి సహకారం అందిస్తోన్న NRI TDP విభాగాన్ని ప్రశంసించారు.(1/2) pic.twitter.com/zgkxmNUhFi
— Telugu Desam Party (@JaiTDP) March 29, 2022
Related News
Chandrababu Naidu: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం.. పోలింగ్ పై చంద్రబాబు రియాక్షన్
Chandrababu Naidu: రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా అభినందనలు అంటూ ఏపీ పోలింగ్ పై రియాక్ట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడం వెల్లివిరిసిన ప్�