40 Dead in Turkey Blast: టర్కీలో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం!
టర్కీలోని నల్ల సముద్ర తీరంలో మీథేన్ పేలుడు సంభవించడంతో 40 మంది చనిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను
- By Balu J Published Date - 04:52 PM, Sat - 15 October 22

టర్కీలోని నల్ల సముద్ర తీరంలో మీథేన్ పేలుడు సంభవించడంతో 40 మంది చనిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను రక్షకులు బయటకు తీశారు. డజన్ల కొద్దీ బొగ్గు గని కార్మికులు ఇప్పటికీ వందల మీటర్ల భూగర్భంలో చిక్కుకున్నారు. ఆ దేశ మంత్రి సులేమాన్ సోయ్లు ఘటన గురించి మీడియాతో మాట్లాడారు. “మేం మొత్తం 40 మంది చనిపోయినట్లు లెక్కించాము. 58 మంది మైనర్లు స్వయంగా రక్షించగలిగం. కొంతమందిని రక్షించినవాళ్లకు ధన్యవాదాలు. 28 మంది వ్యక్తులు తమంతట తాముగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాలలో అనేక మంది గాయపడ్డారు.
మేము నిజంగా విచారకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం” అని సోయ్లు అత్యవసరంగా చిన్న బొగ్గు మైనింగ్ పట్టణం అమాస్రాకు బయలుదేరిన తర్వాత అన్నారు. “మొత్తం 110 మంది (భూగర్భంలో) పనిచేస్తున్నారు. వారిలో కొందరు తమంతట తాముగా బయటకు వచ్చారు, మరికొందరు రక్షించబడ్డారు. 49 మంది మైనర్లు ఇప్పటికీ అందులో చిక్కుకున్నారు. 300 మరియు 350 మీటర్ల (985 నుండి 1,150 అడుగులు) దిగువన ఉన్న రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్నారని ఆ దేశ మంత్రి తెలిపారు.