Kurnool : కర్నూల్లో దారుణం.. వీధికుక్కల దాడిలో 34 మేకలు మృతి
కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామంలో వీధి కుక్కల స్వైక విహారం చేశాయి. మేకలపై వీధికుక్కల దాడి చేసి
- By Prasad Published Date - 10:56 AM, Wed - 13 September 23
కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామంలో వీధి కుక్కల స్వైక విహారం చేశాయి. మేకలపై వీధికుక్కల దాడి చేసి చంపాయి. ఈ ఘటనలో 34 మేకలు మృతి చెందాయి. గ్రామంలో నివాసముంటున్న రమేష్కు 70 మేకలు ఉన్నాయి. వీటితోనే రమేష్ కుటుంబం జీవనం సాగిస్తుంది. ఎప్పటిలాగే తన మందను మేత కోసం సమీపంలోని వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లాడు. అకస్మాత్తుగా వీధి కుక్కల గుంపు మేక పిల్లపై దాడి చేసింది. రమేష్ కుక్కలను తరిమివేసి మేక పిల్లలను రక్షించేలోపే దాదాపు మేకలన్నీ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాయి. 34 మేకలు చనిపోవడంతో కుటుంబ పోషణకు వేరే ఆదాయం లేదని రమేష్ వాపోయాడు. దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించాలని బాధితుడు రమేష్ కోరారు.
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.