111 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలిగించిన ఎన్నికల సంఘం.. కారణం ఇదే!
- By Nakshatra Published Date - 08:00 AM, Wed - 22 June 22
ఉనికిలో లేనివిగా గుర్తించిన 111 రాజకీయ పార్టీలను తమ రిజిస్టర్ నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు భారత ఎన్నికల సంఘం తాజాగా తెలిపింది. వ్యవస్థను ప్రక్షాళన చేసే లక్ష్యంతో ఈ రాజకీయ పార్టీలు వెరిఫికేషన్లో ఉనికిలో లేవని తేలింది. అయితే ఈ రిజిస్టర్డ్ గుర్తింపు లేని రాజకీయ పార్టీల వెరిఫికేషన్లో లేదా వారి చిరునామాలు, కమ్యూనికేషన్ను ధృవీకరించడానికి అధికారులు జారీ చేసిన లేఖల్లో ఉనికిలో లేవని గుర్తించినట్లు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు నివేదించిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు ECI తెలిపింది.
తపాలా శాఖ ద్వారా బట్వాడా చేయని వివరాలు తిరిగి వచ్చాయి.ఈ నెలలో ఈసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు వారు అలాంటి 87 ఉనికిలో లేని రాజకీయ పార్టీలను తొలగించారు. ఇకపోతే దేశంలోని పలు రాజకీయ పార్టీలను ఇటీవలే తమ జాబితా నుంచి తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కూడా మరికొన్ని పార్టీలపై కొరఢా ఝుళిపించింది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 111 నమోదైన గుర్తింపుపొందని రాజకీయ పార్టీలను తమ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది.
అంతే కాకుండా ఆయా పార్టీలకు వచ్చిన విరాళాలు, చందాలను పార్టీలు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉండగా అయితే ఆ దిశగా ఈ 111 పార్టీలు నడుచుకోక పోవడంతో ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వచ్చినా కూడా ఈ పార్టీలు స్పందించలేదు. దీంతో 111 పార్టీలను జాబితా నుంచి తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Related News
PM Modi Vs Rahul Gandhi : ప్రధాని మోడీ, రాహుల్గాంధీ ప్రసంగాలపై ఈసీ నోటీసులు
PM Modi Vs Rahul Gandhi : రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.