Karnataka Dog: 10 కోట్ల శునకంతో సెల్ఫీల కోసం ఎగబడుతున్న జనం..?
సాధారణంగా చాలామంది జంతు ప్రేమికులు ఇంట్లో పిల్లులు, కుక్కలు లాంటి జంతువులను పెంచుకుంటూ ఉంటారు.
- By Nakshatra Published Date - 10:10 AM, Wed - 5 October 22
సాధారణంగా చాలామంది జంతు ప్రేమికులు ఇంట్లో పిల్లులు, కుక్కలు లాంటి జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఇది చాలా వరకు ఎక్కువ మంది కుక్కలని పెంచుకుంటూ ఉంటారు. వేలు,లక్షలు ఖర్చుపెట్టి కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా వాటికీ కోసం నెలకు లక్షలు,వేలు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. తినడం కోసం,హెల్త్ విషయం కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ శునకాలు విక్రయించినప్పుడు కొనుగోలు చేసినప్పుడు లక్షలు కోట్లు కూడా పలుకుతూ ఉంటాయి.
తాజాగా కూడా ఒక కుక్క పది కోట్లు పలికి టాక్ ఆఫ్ ది కర్ణాటక గా మారింది. పూర్తి వివరాలు వెళితే.. ఇప్పుడు మనం తెలుసుకోబోయే శునకం ఖరీదు 10 కోట్లతో పాటు దానికి నెలకు 25 వేల వరకు ఖర్చు అవుతుందట. దసరా నవరాత్రులలో భాగంగా తాజాగా కర్ణాటక లోని శివ మొగ్గలో ఆదివారం రాష్ట్రా స్థాయిలో శునకాల పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 100 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 22 జాతుల శునకాలతో వాటి యజమానులు కూడా వచ్చారు.
22 జాతులలో శునకాలలో ఒకటైన బెంగళూరుకు చెందిన వ్యాపారి కలవం సతీష్ తీసుకువచ్చిన శునకం ఏకంగా 10 కోట్ల ధరను పలికింది. అంతేకాకుండా అక్కడకు వచ్చిన వారి అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా ఆ శునకం టిబెటియన్ మస్టిప్ జాతికీ చెందినట్లు అతను వెల్లడించారు. అంతే కాకుండా ఆ శునకానికి బీమా అని కూడా పేరు పెట్టినట్టుగా సతీష్ తెలిపారు. ఆ శునకానికి ఏసీ గది ఆహారం ఇతర సదుపాయాల కోసం నెలకు దాదాపుగా 25000 ఖర్చు అవుతుంది అని వెల్లడించారు సతీష్. ఇక ఆ ఒక్క ధర 10 కోట్లు పలకడంతో అక్కడికి వచ్చిన స్థానికులు ఆ కుక్క తో సెల్ఫీలు దిగడం కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ముందే కాకుండా అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆ కుక్కకు సంబంధించిన ఫోటోలను వీడియోలను వారి మొబైల్లో బంధిస్తున్నారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Related News
SIT Launches Helpline: లైంగిక బాధితుల కోసం సిట్ హెల్ప్లైన్ నంబర్
హసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు బాధిత మహిళలు స్వయంగా ప్రత్యేక దర్యాప్తు శాఖను సంప్రదించి తమ బాధలను చెప్పుకునే అవకాశం కల్పించింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్.