Accident: ములుగులో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 6 మందికి గాయాలు
ములుగులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
- By Hashtag U Published Date - 09:59 PM, Wed - 9 February 22
ములుగులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన వీరబాబు కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేసేందుకు మేడారం వెళ్లారు. మేడారం నుంచి హన్మకొండలో ఇంటికి తిరిగి వస్తుండగా కారు డ్రైవర్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టాడు. కారులో ప్రయాణిస్తున్న భద్రమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Related News
Lok Sabha Elections 2024: ములుగు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
1.05.2024 సాయంత్రం 4.00 గంటల నుంచి 14.05.2024 సాయంత్రం 4.00 గంటల వరకు లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడడాన్ని నిషేధించారు.