What is Bha : హమ్మయ్య.. చెప్పుల కష్టాలకు చెక్.. ‘భా’.. వచ్చేస్తోంది!
What is Bha : మన దేశంలో నేటికీ అమెరికా, బ్రిటన్ కాళ్ల సైజుల ఆధారంగానే చెప్పులు, షూస్ను తయారు చేస్తున్నారు.
- By Pasha Published Date - 08:02 AM, Wed - 24 April 24
![What is Bha : హమ్మయ్య.. చెప్పుల కష్టాలకు చెక్.. ‘భా’.. వచ్చేస్తోంది!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/04/What-is-Bha.jpg)
What is Bha : మన దేశంలో నేటికీ అమెరికా, బ్రిటన్ కాళ్ల సైజుల ఆధారంగానే చెప్పులు, షూస్ను తయారు చేస్తున్నారు. అందుకే చాలామందికి భారతీయులకు ఆ సైజులు కరెక్టుగా సరిపోవడం లేదు. కొంచెం పెద్దగానో.. కొంచెం చిన్నగానో.. మొత్తం మీద అసౌకర్యంగానో ఉంటున్నాయి. అమెరికా, బ్రిటన్ వాళ్లతో పోలిస్తే మన కాళ్లు వెడల్పుగా ఉంటాయి. అంటే ఇన్నాళ్లుగా మనం ఇరుకు చెప్పులతో అడ్జస్ట్ అయిపోయాం. ఈవిధంగా మనం ఎదుర్కొంటున్న చెప్పుల సమస్యలకు త్వరలోనే చెక్ పడనుంది. భారతీయుల కాళ్ల కొలతలతో సరికొత్త ప్రామాణిక వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దాని పేరే ‘భా’. భా అంటే భారత్ . భారత్ ఫుట్వేర్(What is Bha) సైజుల విధానాన్ని డెవలప్ చేసేందుకుగానూ దేశవ్యాప్తంగా ఇటీవల భారతీయుల పాదాల కొలతలపై సర్వే నిర్వహించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిధిలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎల్ఆర్ఐ) ఈ అధ్యయనాన్ని చేసింది.
We’re now on WhatsApp. Click to Join
సర్వే విశేషాలు..
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్వేలో భాగంగా 2021 డిసెంబర్ నుంచి 2022 మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా లక్ష మంది ప్రజల షూ కొలతలను సేకరించి అధ్యయనం నిర్వహించారు.
- పాదాల సైజు, వాటి నిర్మాణ తీరు, సగటు భారతీయుల పాదాల ఆకారం గురించి అర్థం చేసుకునేందుకు 3డీ ఫుట్ స్కానింగ్ మెషీన్లను సర్వే కోసం వినియోగించారు.
- సగటు భారతీయ మహిళ పాదం 11 ఏళ్ల వయసులోనే గరిష్ట సైజుకు చేరుకుంటుందని సర్వేలో వెల్లడైంది.
- సగటు భారతీయ పురుషుడి పాదం 15 లేదా 16 ఏళ్లకు గరిష్ట సైజుకు చేరుకుంటుందని సర్వేలో తేలింది.
- భారతీయుల పాదాలు యూరోపియన్లు లేదా అమెరికన్ల పాదాలకన్నా వెడల్పుగా ఉంటాయని సర్వే నివేదిక చెప్పింది.దీనివల్ల గత కొన్ని దశాబ్దాలుగా భారతీయులంతా బిగుతుగా ఉన్న చెప్పులే ధరిస్తున్నారని, కొందరు పొడవైన పాదరక్షలు కొనుక్కుంటున్నారని సర్వేలో గుర్తించారు.
- హై హీల్స్ వాడే మహిళలు వాళ్ల పాదాల సైజుకన్నా పెద్దవైన హైహీల్స్నే వాడుతున్నారని స్టడీలో వెల్లడైంది.
- మగవారైతే షూ వదులుగా ఉండకుండా చూసుకొనేందుకు లేస్లను మరింత గట్టిగా కడుతున్నారని నిపుణులు గుర్తించారు. దీనివల్ల షూ ధరించే వారిలో రక్త ప్రసరణ దెబ్బతింటోంది.
- వృద్ధులు, షుగర్ వ్యాధితో బాధపడేవారు తప్పుడు సైజుల చెప్పులు ధరిస్తూ గాయాల ముప్పును ఎదుర్కొంటున్నారు.
Also Read :Papala Bhairavadu : రాజకీయ విమర్శనాస్త్రంగా ‘పాపాల భైరవుడు’.. పురాణాల్లో ఏముంది ?
భారత్ ఫుట్వేర్ సైజుల విధానం అందుబాటులోకి వస్తే వినియోగదారులకు ఎంతో సౌకర్యం కలుగుతుంది. ఇప్పటికే ఈ సర్వే నివేదికను సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణుల టీమ్ కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)కి సమర్పించింది. ఆ విభాగం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)కు ఈ సిఫార్సులను పంపింది. దేశంలో సైజుల విధానానికి అనుమతి తెలపడంతోపాటు దాన్ని అమలు చేసే అధికారం బీఐఎస్కే ఉంది. ప్రస్తుతం యూకే కొలతల ప్రకారం 10 సైజుల విధానం అమల్లో ఉండగా ‘భా’ వల్ల వాటి సంఖ్య 8కి తగ్గనుంది. దీనివల్ల ఇకపై అర సైజుల అవసరం తప్పనుంది. 2025 సంవత్సరం నుంచి భారత్ ఫుట్వేర్ సైజుల విధానం అమల్లోకి వస్తుందని అంటున్నారు.
Also Read :Padamati Kondallo: ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Budget 2024: బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి కూడా పేపర్ లెస్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/safeimagekit-Screenshot-2024-07-23-100222_11zon-1.png)
Budget 2024: బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి కూడా పేపర్ లెస్..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు అంటే మంగళవారం నాడు మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు.