Danger Water: విషం తాగుతోన్న భారత జనాభా, రాజ్యసభలో నిజాలు..!
దేశంలోని 80శాతం జనాభా మంచినీళ్ల రూపంలో విషం తాగుతున్నారు. ఆ విషయాన్ని ఇండియన్ పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టారు.
- By CS Rao Published Date - 05:00 PM, Tue - 2 August 22
దేశంలోని 80 శాతం జనాభా మంచినీళ్ల రూపంలో విషం తాగుతున్నారు. ఆ విషయాన్ని ఇండియన్ పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టారు. దిగ్ర్భాంతి కలిగించేలా రాజ్యసభ చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు భారతదేశ జనాభా విషపూరిత మంచినీళ్లు తాగుతున్నారు.
అన్ని రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో విషపూరిత లోహాలు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. దేశ జనాభాలో 80 శాతానికి పైగా ప్రజలు భూమి నుండి నీటిని పొందుతున్నారు. భూగర్భ జలాల్లో ప్రమాదకర లోహాలు నిర్దేశిత ప్రమాణాన్ని మించి ఉన్న నీళ్లను తాగుతున్నారని జల్ శక్తి మంత్రిత్వ శాఖ చెబుతోంది. తాగు నీటి వనరులు కలుషితమై ఉన్న నివాస ప్రాంతాల సంఖ్యను రాజ్యసభ బయట పెట్టింది. ఆ నివేదిక ప్రకారం 671 ప్రాంతాలు ఫ్లోరైడ్, 814 ప్రాంతాలు ఆర్సెనిక్, 14,079 ప్రాంతాలు ఇనుము, 9,930 ప్రాంతాలు లవణీయత, 517 ప్రాంతాలు నైట్రేట్ మరియు 111 ప్రాంతాలు భారీ లోహాలతో ఉన్న భూగర్భ జలాలు ఉన్నాయని వివరించింది.
Also Read: Missed IT Deadline: గడువు తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారా? ఇవి తెలుసుకోండి!!
భూగర్భ జలాల్లోని విషం నగరాల కంటే గ్రామాలలో చాలా తీవ్రంగా ఉంది. గ్రామాల్లో తాగు నీటికి ప్రధాన వనరులు: చేతి పంపులు, బావులు, నదులు లేదా చెరువులు. సాధారణంగా గ్రామాల్లో ఈ నీటిని శుభ్రం చేయడానికి మార్గం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు విషపూరితమైన నీటిని తాగాల్సి వస్తోందని రాజ్యసభ వెల్లడించింది.
ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను ఆగస్టు 2019 లో ప్రారంభించినట్లు లోక్సభకు తెలిపింది. దీని కింద 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేయాలి. కానీ, ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పటివరకు 9.81 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇది కాకుండా, అమృత్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2021 లో ప్రారంభించింది. దీని కింద, వచ్చే 5 సంవత్సరాలలో అంటే 2026 నాటికి అన్ని నగరాలకు కుళాయి నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని రాజ్యసభ వేదికగా ప్రభుత్వం చెబుతోంది.
Also Read: ED Raids: `హెరాల్డ్` ఆఫీస్ పై ఈడీ సోదాలు
నీరు రాష్ట్రానికి సంబంధించిన అంశమని, కాబట్టి ప్రజలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలపడం గమనార్హం. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు అనేక పథకాలు అమలు చేస్తోందని వివరించింది. భారత దేశ వ్యాప్తంగా జనాభా తాగుతోన్న విషపూరిత మంచి నీళ్ల గురించి రాజ్యసభ వేదికగా కేంద్రం చెప్పిన ముఖ్య అంశాలివి.
– 25 రాష్ట్రాల్లోని 209 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో లీటరుకు 0.01 మి.గ్రా కంటే ఎక్కువ ఆర్సెనిక్ ఉంటుంది.
– 29 రాష్ట్రాల్లోని 491 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఐరన్ లీటరుకు 1 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుంది.
– 11 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో కాడ్మియం లీటరుకు 0.003 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుంది.
– 16 రాష్ట్రాల్లోని 62 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో క్రోమియం లీటరుకు 0.05 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుంది.
– 18 రాష్ట్రాల్లోని 152 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో యురేనియం లీటరుకు 0.03 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుంది.
– ఒక వ్యక్తి ప్రతిరోజూ సగటున 3 లీటర్ల నీరు తాగుతాడని సాధారణంగా నమ్ముతారు. అయితే ప్రభుత్వ పత్రాల ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. మీరు ప్రతిరోజూ 2 లీటర్ల నీరు తాగితే, కొంత మొత్తంలో విషం మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
– భూగర్భ జలాల్లోని ఆర్సెనిక్, ఇనుము, సీసం, కాడ్మియం, క్రోమియం, యురేనియం నిర్దేశిత ప్రమాణం కంటే ఎక్కువగా ఉండటం వల్ల మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
Also Read: PM Modi: `ప్రొఫైల్ పిక్` ను మార్చేసిన మోడీ
– అధిక ఆర్సెనిక్ అంటే చర్మ వ్యాధులు మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
– అధిక ఇనుము అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను సూచిస్తుంది.
– నీటిలో అధిక మొత్తంలో సీసం మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
– అధిక స్థాయి కాడ్మియం మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
– అధిక మొత్తంలో క్రోమియం చిన్న ప్రేగులలో వ్యాపించే హైపర్ప్లాసియాకు కారణమవుతుంది, ఇది కణితుల ప్రమాదాన్ని పెంచుతుంది.
– త్రాగే నీటిలో యురేనియం అధికంగా ఉండటం వల్ల కిడ్నీ వ్యాధులు మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
మొత్తం మీద విషపూరిత మంచినీళ్లు తాగుతూ దేశ జనాభా అనారోగ్యానికి గురవుతున్నారు. ఫలితంగా అనారోగ్య భారత్ దిశగా పాలకులు దేశాన్ని తీసుకెళుతున్నారన్నమాట.
Also Read: MIG 21: 60 ఏళ్లలో 200 మందిని మింగేసిన “మిగ్-21″… కొనసాగింపుపై అభ్యంతరాలు!!
Related News
Manmohan Singh : మహాన్ మన్మోహన్.. పార్లమెంటరీ ప్రస్థానానికి నేటితో తెర
Manmohan Singh : మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్సింగ్ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం ఈరోజుతో ముగియనుంది.