Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Special News
  • ⁄200 Mig Pilots Killed In 60 Years

MIG 21: 60 ఏళ్లలో 200 మందిని మింగేసిన “మిగ్-21″… కొనసాగింపుపై అభ్యంతరాలు!!

రష్యా నుంచి భారత్ కొన్న మిగ్‌-21 యుద్ధ విమానాలు మృత్యు శకటాలుగా మారాయి. తాజాగా గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ యుద్ధవిమానం రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాలో కుప్పకూలింది.

  • By Hashtag U Published Date - 10:00 AM, Sun - 31 July 22
MIG 21: 60 ఏళ్లలో 200 మందిని మింగేసిన “మిగ్-21″… కొనసాగింపుపై అభ్యంతరాలు!!

రష్యా నుంచి భారత్ కొన్న మిగ్‌-21 యుద్ధ విమానాలు మృత్యు శకటాలుగా మారాయి. తాజాగా గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ యుద్ధవిమానం రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఈవిధంగా మిగ్‌-21 యుద్ధ విమానాలు కూలడం తొలిసారేం కాదు. వాటిని సైన్యంలోకి ప్రవేశపెట్టినప్పటి  60 ఏళ్లు అవుతోంది. ఈ 60 ఏళ్లలో దాదాపు 400 ప్రమాదాలు జరిగాయంటే వాటి ఫెయిల్యూర్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈనేపథ్యంలో మిగ్-21 ఫైటర్ జెట్లను పక్కన పెట్టాలనే వాదన తెరపైకి వస్తోంది.మిగ్‌-21 ప్రమాదాలు పెరగడంతో…తేజాస్ ఫైటర్‌పై వాయుసేన దృష్టి సారించింది. భారత వైమానిక దళం… సెప్టెంబర్ చివరి నాటికి మిగ్‌-21 విమానాల సేవలను నిలిపివేయాలని భావిస్తోంది.

మృత్యువాత పడ్డది ఎందరో..

మిగ్‌-21 మోడల్‌లో బైసన్ సిరీస్‌ సరికొత్త వేరియంట్. దీన్ని సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ.. తరచూ ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. గత 60 ఏళ్లలో ఏకంగా 400 మిగ్-21 యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో 200 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది సాధారణ పౌరులు…ఈ ప్రమాదాలకు బలి కావాల్సి వచ్చింది. .

రష్యా ఉత్పత్తి ఆపేసినా.. ఇండియా వాడుతోంది

1963 సంవత్సరంలో రష్యా నుంచి మిగ్ యుద్ధ విమానాల కొనుగోలును భారత్ ప్రారంభించింది. 1967లో ఈ విమానాల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్ వచ్చింది. అనంతరం విమానాల ఉత్పత్తిని “హాల్” ప్రారంభించింది. రష్యా 1985లో మిగ్ విమానాల తయారీని నిలిపివేసింది. కానీ భారత వాయుసేన మాత్రం సెన్సార్లు, వెపన్స్‌… అప్‌గ్రేడ్ చేసి దాన్ని ఉపయోగిస్తోంది.భారత వైమానిక దళానికి 42 స్వ్కాడ్రన్లు ఉండాలి. ప్రస్తుతం 32 స్వ్కాడ్రన్లే ఉన్నాయి. ఇందులో మిగ్‌-21 బైసన్‌కు నాలుగు స్క్వాడ్రన్లు ఉన్నాయి

అభినందన్‌ వర్దమాన్‌ ఘటన గుర్తుందా?

2019లో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్దమాన్‌ కూడా… మిగ్‌-21 విమానం ప్రమాదంలోనే పాకిస్తాన్‌ భూభాగంలో పడిపోయాడు. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌-16 ఫైటర్‌ను కూల్చేసిన తర్వాత.. అభినందన్‌ విమానం కూలిపోయింది. ఆ తర్వాతే భారత సైన్యం బాలాకోట్‌పై దాడులకు పాల్పడింది.

Tags  

  • 200 pilots
  • 200 pilots killed
  • 60 years
  • MIG pilots

Related News

    Latest News

    • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

    • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

    • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

    • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

    • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

    Trending

      • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

      • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

      • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

      • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

      • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: