Thalekunnil Basheer: కాంగ్రెస్ సీనియర్ నేత ‘బషీర్’ ఇకలేరు!
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులుగా పనిచేసిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తాలెకున్ని బషీర్ మార్చి 24 గురువారం నాడు కన్నుమూశారు.
- By Balu J Published Date - 01:25 PM, Fri - 25 March 22
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులుగా పనిచేసిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తాలెకున్ని బషీర్ మార్చి 24 గురువారం నాడు కన్నుమూశారు. ఆయన వెంబయంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 79 ఏళ్ల వయసులో ఉన్న ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం. బషీర్ 1977-79 మరియు 1979-84లో రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1984-89, 1989-91లో రెండుసార్లు లోక్సభకు కూడా.
1977 అసెంబ్లీ ఎన్నికలలో, బషీర్ తిరువనంతపురంలోని కజకుట్టం నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా (MLA) ఎన్నికయ్యారు. అయితే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలల తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఎకె ఆంటోనీ ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమం చేయడానికి ఆయన రాజీనామా చేశారట. ఇవానియోస్ కాలేజ్, లా కాలేజ్ నుండి పట్టభద్రుడైన బషీర్ ‘వెలిచం కూడతల్ వెలిచమ్’, ‘రాజీవ్ గాంధీ: సూర్య తేజస్సింటే ఒర్మక్కు’, ‘మండేలయుడే నత్తిల్, గాంధీజీయుడెయుమ్’ మరియు ‘కె దామోదరన్ ముతాల్ బెర్లిన్ కుంజనాంతన్ నాయర్ వారే’ అనేక పుస్తకాలను రచించారు. దివంగత నేత, ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ రాజకీయాల విలువలను నిలబెట్టిన నాయకుడు అని ఆయన అన్నారు. సంకుచిత ప్రయోజనాలకు అతీతంగా ప్రజాసమస్యల్లో జోక్యం చేసుకుని ప్రజా ప్రయోజనాలను నిలబెట్టేందుకు బషీర్ ప్రయత్నించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Related News
Durga Temple: ఈ దుర్గా మాత ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తారట..! ఆ టెంపుల్ విశేషాలివే..!
దుర్గా మాత (Durga Temple) పురాతన ఆలయం కేరళలోని మలప్పురంలో ఉన్న ముత్తువల్లపర్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తుంటారు.