Tamil Nadu: మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెల 1000 రూపాయలు.. ఎప్పటి నుంచి అంటే..?
తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో సెప్టెంబరు నుంచి అర్హులైన మహిళా కుటుంబ పెద్దలకు నెలవారీ రూ.1,000 సహాయ పథకం ప్రకటించడం అత్యంత పెద్దది.
- By Gopichand Published Date - 10:10 AM, Tue - 21 March 23
తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో సెప్టెంబరు నుంచి అర్హులైన మహిళా కుటుంబ పెద్దలకు నెలవారీ రూ.1,000 సహాయ పథకం ప్రకటించడం అత్యంత పెద్దది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేస్తూ, పథకం అమలుకు అవసరమైన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి రూ.7 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇంటి బాధ్యతలు నిర్వర్తించే మహిళల కోసం ‘మగళిర్ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు) ప్రకటించింది. ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతినెల రూ.1000 చొప్పున పంపిణీ చేస్తారు.
తమిళనాడు ప్రభుత్వం 2023-24 రాష్ట్ర బడ్జెట్ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సంస్కరణల వల్ల రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.62 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు తగ్గిందని అన్నారు. బడ్జెట్ను సమర్పిస్తూ.. గత రెండేళ్లలో ఎన్నో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, రెవెన్యూ లోటు తగ్గుముఖం పట్టిందని త్యాగ రాజన్ అన్నారు. బడ్జెట్లో ఆర్థిక మంత్రి.. కోయంబత్తూర్, మధురైలో మెట్రో రైలు ప్రాజెక్టులను ప్రకటించారు. చెన్నైలో ఆధునిక ‘గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ’ని ఏర్పాటు చేయడమే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలను తమిళంలోకి అనువదించడానికి రూ. 5 కోట్లు కేటాయించారు.
Also Read: Transgender Advocate: కేరళలో అడ్వకేట్గా ట్రాన్స్జెండర్
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లతో తరగతి గదులు, ప్రయోగశాలలు, మరుగుదొడ్లు నిర్మిస్తుందని రాజన్ చెప్పారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, డిఎంకె కుటుంబ పెద్దకు రూ. 1,000 ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఈ హామీని స్టాలిన్ నెరవేర్చలేదని ఆరోపించింది. ఈ పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని అప్పటి అధికార డీఎంకే ప్రకటించింది. ఇటీవల ఈరోడ్ (తూర్పు) ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ బడ్జెట్ సమర్పించినప్పుడు పథకాన్ని ప్రారంభించే తేదీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అన్నాదురై జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 15న సీఎం ఎంకే స్టాలిన్ దీనిని ప్రారంభించనున్నారు.
Related News
Lok Sabha Elections: 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. పలు సంస్థలకు సెలవులు
శుక్రవారం (ఏప్రిల్ 19, 2024) లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మొదటి దశ 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ 102 సీట్లు 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి.