Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్..!
కర్ణాటక (Karnataka) ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నాలుగు రోజులుగా సాగిన డ్రామాకు నేటితో తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పలు సమావేశాల అనంతరం బుధవారం అర్థరాత్రి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి (Karnataka CM) పేరును ప్రకటించారు.
- By Gopichand Published Date - 06:46 AM, Thu - 18 May 23
కర్ణాటక (Karnataka) ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నాలుగు రోజులుగా సాగిన డ్రామాకు నేటితో తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పలు సమావేశాల అనంతరం బుధవారం అర్థరాత్రి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి (Karnataka CM) పేరును ప్రకటించారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కర్నాటకలో ముఖ్యమంత్రి విషయంలో వరుసగా నాలుగు రోజుల పాటు సస్పెన్స్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుంది. మే 20న మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో వీరి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
బెంగళూరులో ఈరోజు (మే 18) సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం జరగనుంది. సీఎల్పీ సమావేశానికి బెంగళూరు చేరుకోవాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కేంద్ర పరిశీలకులను కోరారు. ఈరోజు లేదా రేపు తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తామని, 72 గంటల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ కర్నాటక ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా బుధవారం తెలిపారు.
Also Read: CM KCR: మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం, 95 నుంచి 105 స్థానాలు గెలవబోతున్నాం!
బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్తో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన అభ్యర్థుల సుదీర్ఘ భేటీ కొనసాగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఏకాభిప్రాయం కోసం డీకే శివకుమార్ను కూడా సమావేశంలో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య మధ్య ఉమ్మడి ఒప్పందం కుదిరిందని అంతకుముందు రోజు వార్తలు వచ్చాయి. బెంగళూరులో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కానీ సాయంత్రం నాటికి పార్టీ దీనిని ఖండించింది. సీఎం పేరును నిర్ణయించడానికి మరో 2-3 రోజుల సమయం పడుతుందని చెప్పబడింది. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రిపై ఏకాభిప్రాయం కుదిరిందని అర్థరాత్రి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై కాంగ్రెస్ ఆధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Related News
CM Revanth Reddy : ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళతో సఖ్యతగా ఉంటాం
నిన్నటి వరకు ఎన్నికల హడావిడిలో మునిగిపోయిన అధికార యంత్రాంగం ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మీడియా చిట్ చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.