Trans Man Gets Pregnant: తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్జెండర్ జంట.. దేశంలో ఇదే తొలిసారని ప్రకటన..!
కేరళకు (Kerala) చెందిన ఓట్రాన్స్జెండర్ జంట (Trans-Couple)తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. కేరళలోని కోజికోడ్లో నివసిస్తున్న ఓ ట్రాన్స్జెండర్ దంపతుల ఇంటికి త్వరలో ఓ చిన్న అతిథి రాబోతోంది. జియా, జహాద్ దంపతులు సోషల్ మీడియా ద్వారా తల్లిదండ్రులు కాబోతున్న శుభవార్తను పంచుకున్నారు.
- By Gopichand Published Date - 12:00 PM, Sat - 4 February 23
కేరళకు (Kerala) చెందిన ఓట్రాన్స్జెండర్ జంట (Trans-Couple)తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. కేరళలోని కోజికోడ్లో నివసిస్తున్న ఓ ట్రాన్స్జెండర్ దంపతుల ఇంటికి త్వరలో ఓ చిన్న అతిథి రాబోతోంది. జియా, జహాద్ దంపతులు సోషల్ మీడియా ద్వారా తల్లిదండ్రులు కాబోతున్న శుభవార్తను పంచుకున్నారు. ఈ జంట మార్చి నెలలో తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. జియా, జహాద్ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ప్రెగ్నెన్సీ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. దేశంలో ఓ ట్రాన్స్జెండర్ పురుషుడు గర్భం దాల్చడం ఇదే తొలిసారని వారు పేర్కొన్నారు.
Also Read: Sradda Das : టైట్ ఫిట్ అందాలతో మరిపిస్తున్న శ్రద్ధాదాస్..
నివేదికల ప్రకారం.. ట్రాన్స్ కపుల్ తమ లింగాన్ని మార్చుకోవడానికి శస్త్రచికిత్సను ఆశ్రయించారు. జియా పురుషుడిగా జన్మించాడు. కానీ స్త్రీగా మారాడు. అయితే జహాద్ స్త్రీగా జన్మించింది. కానీ తరువాత పురుషుడిగా మారాలని నిర్ణయించుకుంది. అయినప్పటికీ జహాద్ గర్భం దాల్చాడు. పురుషుడిగా మారేందుకు చేసిన సర్జరీలో గర్భాశయం, మరికొన్ని అవయవాలు తొలగించలేదని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ చిత్రాలపై ఇన్స్టా యూజర్స్ ఈ జంటను అభినందిస్తున్నారు. ఈ జంట ఒక పోస్ట్పై 19 వేలకు పైగా లైక్లు వచ్చాయి. మరొకదానిపై రెండు వేలకు పైగా లైక్లు వచ్చాయి. ఇటీవల షేర్ చేసిన పోస్ట్పై ఒకటిన్నర వేలకు పైగా లైక్లు కనిపిస్తున్నాయి.
ఒక యూజర్ ఇలా వ్యాఖ్యానించారు. “అభినందనలు! ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్లో చూసిన అత్యంత అందమైన విషయం ఇది స్వచ్ఛమైన ప్రేమకు హద్దులు లేవు.” అని రాయగా.. మరో యూజర్ ఇలా వ్రాశారు. “చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.” అని పేర్కొన్నారు.
Related News
Durga Temple: ఈ దుర్గా మాత ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తారట..! ఆ టెంపుల్ విశేషాలివే..!
దుర్గా మాత (Durga Temple) పురాతన ఆలయం కేరళలోని మలప్పురంలో ఉన్న ముత్తువల్లపర్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తుంటారు.