Modi Gets Emotional : ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధాని మోడీ..
11 ఏళ్ల క్రితం సేలం జిల్లాలో హత్యకు గురైన బీజేపీ నేత వి.రమేశ్ను గురించి మోడీ ఎమోషనల్ అయ్యారు
- By Sudheer Published Date - 08:04 PM, Tue - 19 March 24
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దీంతో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇక మరోసారి విజయం సాధించి ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టాలని మోడీ (Modi) చూస్తున్నాను. ఈ తరుణంలో తన వయసును సైతం లెక్క చేయకుండా దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్నారు. ప్రతి రోజు రెండు , మూడు సభలను కవర్ చేస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు తమిళనాడు లో పర్యటించారు.
We’re now on WhatsApp. Click to Join.
మంగళవారం తమిళనాడు (Tamilanadu)లోని సేలంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. తమిళ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంలోనే మోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దానికి కారణం గతంలో తమిళనాడు బీజేపీ నేత హత్యకు గురికాగా.. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.11 ఏళ్ల క్రితం సేలం (Salem) జిల్లాలో హత్యకు గురైన బీజేపీ నేత వి.రమేశ్ (‘Auditor’ Ramesh)ను గురించి మోడీ ఎమోషనల్ అయ్యారు. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ క్షణం సభ మొత్తం సైలెంట్ అయ్యింది. అనంతరం కొద్దిసేపు తర్వాత తన ప్రసంగాన్ని తిరిగి ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also : Venkateshwara: శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో మీకు తెలుసా?
Related News
Smoke Biscuit Banned: స్మోక్ బిస్కెట్లపై నిషేధం…
చెన్నైలో రెడీ-టు-ఈట్ స్మోక్ పిటా, స్మోక్ బిస్కెట్లు మరియు లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి వండిన ఆహారాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ఆహార భద్రత విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు పొగ బిస్కెట్లు తిని స్పృహ తప్పి పడిపోయాడు,