ఫలించిన తల్లి పోరాటం…ఐదు రోజుల్లో తల్లి చెంతకు చేరబోతున్న బాలుడు
వివాదాస్పద ‘బేబీ కిడ్నాప్’ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కీలక ఆదేశాలు ఇచ్చింది.
- By Hashtag U Published Date - 04:43 PM, Thu - 18 November 21
వివాదాస్పద ‘బేబీ కిడ్నాప్’ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కీలక ఆదేశాలు ఇచ్చింది.వచ్చే ఐదు రోజుల్లో బేబీని తిరిగి కేరళకు తీసుకురావాలని కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ కి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఒక జంట సంరక్షణలో ఉన్న బాలుడు… పుట్టిన వెంటనే తన బిడ్డను కిడ్నాప్ చేసి కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా దత్తత తీసుకున్నారని బాలుడి సొంత తల్లి అనుపమ ఎస్ చంద్రన్ ఆరోపించింది. దీనిపై ఆమె పోరాటం చేస్తున్నారు. బిడ్డను తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చినప్పుడు ఆ బిడ్డ జీవసంబంధమైన తల్లిదండ్రులను గుర్తించడానికి DNA పరీక్ష నిర్వహించనున్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం, ఆంధ్రా నుండి ప్రయాణ సమయంలో శిశువుకు ప్రత్యేక జువైనల్ పోలీసు యూనిట్ ఎస్కార్ట్ను అందించాలని ఆదేశించింది.anupama
తన బిడ్డను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ థైకాడ్లోని కెఎస్సిసిడబ్ల్యు కార్యాలయం ముందు కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న అనుపమ,ఆమె భర్త అజిత్కు ఈ పరిణామం గొప్ప ఉపశమనం కలిగించింది. ఈ ఉత్తర్వులు అందిన తర్వాత ఐదు రోజులలోపు బేబిని ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచవలసిందిగా KSCCW జనరల్ సెక్రటరీని ఆదేశించింది. శిశువు యొక్క DNA పరీక్షను ఎటువంటి ఆలస్యం లేకుండా నిర్వహించాలని…దాని ఫలితాలు వచ్చే వరకు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సంరక్షణ మరియు రక్షణలో బాలుడు ఉండాలని ఆర్డర్ లో తెలిపింది.KSCCW అధికారుల సమాచారం మేరకు…దంపతులు కార్యాలయానికి చేరుకుని ఉదయం ఆర్డర్ కాపీని సేకరించారు. ఈ పరిణామంపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె.. బిడ్డ చేతికి వచ్చే వరకు తన నిరసనను కొనసాగిస్తానని చెప్పారు. KSCCW అధికారులు… ఆమె నుండి బిడ్డను బలవంతంగా వేరు చేయడం వెనుక ఉన్న ప్రతి ఒక్కరిపై న్యాయ పోరాటం కూడా ముందుకు సాగుతుందని ఆమె తెలిపారు. ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని…తాను త్వరలో తన బిడ్డను చూడగలనని ఆశిస్తున్నానని అనుపమ తెలిపారు. DNA పరీక్ష తర్వాత ఎక్కువ లాంఛనాలు ఉండవని నేను నమ్ముతున్నానని తెలిపారు.
Also Read : ఆన్లైన్ లో పిల్లలపై లైగింక వేధింపుల కేసులో తిరుపతికి చెందిన వ్యక్తి అరెస్ట్
స్థానిక సీపీఐ(ఎం) నాయకుడైన తన తండ్రి తన నవజాత శిశువును బలవంతంగా తీసుకెళ్లాడని మహిళ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ విషయంలో తనకు సహాయం చేయనందుకు పార్టీ సీనియర్ నేతలపై ఆమె చేసిన ఆరోపణలు మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ప్రతిపక్ష కాంగ్రెస్-యుడిఎఫ్ ఈ సమస్యను రాష్ట్ర అసెంబ్లీకి తీసుకువెళ్లింది. రాష్ట్రంలో నివేదించబడిన అత్యంత హేయమైన చర్యల్లో ఇదొకటి అని పేర్కొంది. అయితే ప్రభుత్వం ఈ సంఘటనపై శాఖాపరమైన విచారణను ప్రకటించింది. 24 ఏళ్ల అనుపమకు ఏడాది క్రితం పుట్టిన బిడ్డను తన తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్లారని, ఏప్రిల్ నుంచి పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా వారు విముఖత చూపారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.