HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Eye Opening Startling Pm Modi On Congress Giving Away Kathchatheevu Island To Sri Lanka

PM Modi : కాంగ్రెస్ వల్లే మన ద్వీపం లంక పాలైంది.. ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు

PM Modi : ఎన్నికలు సమీపించిన వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దక్షిణ భారతదేశంలో ఓ తేనెతుట్టెను కదిల్చారు.

  • By Pasha Published Date - 01:12 PM, Sun - 31 March 24
  • daily-hunt
Pm Modi
Pm Modi

PM Modi : ఎన్నికలు సమీపించిన వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దక్షిణ భారతదేశంలో ఓ తేనెతుట్టెను కదిల్చారు. మన దేశంలోని తమిళనాడులో ఉండాల్సిన కచ్చతీవు  (బంజరు ద్వీపం) ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన పాపం కాంగ్రెస్‌దే అని ఆయన ఆరోపించారు.  జనావాసాలు లేని 285 ఎకరాల కచ్చతీవు  ద్వీపం  భూభాగాన్ని 1974లో శ్రీలంకకు అప్పగించాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై  సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తు ద్వారా సేకరించిన సమాచారంతో ఈవిషయం వెలుగులోకి వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. కచ్చతీవు  ద్వీపాన్ని మన దేశం కోల్పోవడానికి ఆనాటి ఇందిరాగాంధీ సర్కారే కారణమన్నారు.

Eye opening and startling!

New facts reveal how Congress callously gave away #Katchatheevu.

This has angered every Indian and reaffirmed in people’s minds- we can’t ever trust Congress!

Weakening India’s unity, integrity and interests has been Congress’ way of working for…

— Narendra Modi (@narendramodi) March 31, 2024

We’re now on WhatsApp. Click to Join

దేశ సమగ్రత, ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ మొగ్గుచూపిందని ప్రధాని మోడీ(PM Modi) విమర్శించారు. ‘‘భారత సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో  ఉన్న 1.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కచ్చతీవు ద్వీపం ఒకప్పుడు రామనాథపురం జమిందారీ సంస్థానంలో భాగంగా ఉండేది. 1822లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ద్వీపాన్ని రామస్వామి సేతుపతి నుంచి లీజుకు తీసుకుంది. చట్టపరమైన హక్కులను కలిగి  ఉన్నప్పటికీ కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఆనాడు అప్పగించడం దారుణం’’ అని ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. “భారతీయులందరి కళ్లు తెరిపించే వాస్తవాలు బయటికొచ్చాయి. దేశ భూభాగాన్ని ఎంత ఈజీగా కాంగ్రెస్ వదిలేసిందో వెల్లడైంది.  ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించే విషయం. ఇక కాంగ్రెస్‌ను నమ్మలేమనే భావనకు దేశ ప్రజలు వచ్చారు. 75 ఏళ్ల పాలనలో దేశానికి కాంగ్రెస్ చేసింది ఇదే’’ అని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో కామెంట్ చేశారు.

Also Read :Easter Festival : ఇవాళే ఈస్టర్.. ఈ పండుగ ఆదివారమే ఎందుకొస్తుంది ?

‘‘కచ్చతీవు లాంటి చిన్న ద్వీపానికి నేను అంతగా ప్రాముఖ్యతను ఇవ్వను. దాని హక్కులపై భారత్ తరఫు వాదనలను వదులుకోవడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు’’ అని 1961 మే 10న నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చెప్పారనే విషయాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై  ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలో ఉంది. 

Also Read :Phone Tapping : ‘ఫోన్ ట్యాపింగ్’ దడ.. మీ ఫోన్ ట్యాప్ అయితే ఇలా గుర్తించండి

1983లో శ్రీలంకలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కచ్చతీవు   ద్వీపం భారతీయ తమిళ మత్స్యకారులు, సింహళ ఆధిపత్యమున్న లంక నౌకాదళం మధ్య పోరాటాలకు యుద్ధభూమిగా మారింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను అనుకోకుండా దాటినందుకు అప్పట్లో ఎంతోమంది భారతీయులను అరెస్టు చేసి జైళ్లలో వేశారు. అయితే ఈ  దీవిని భారత్‌కు లీజుకు ఇచ్చేలా శ్రీలంక ప్రభుత్వం చొరవ చూపాలంటూ అక్కడి సింహళీయ మత్స్యకారులు పలుమార్లు నిరసనకు దిగారు. అప్పటి నుంచి కచ్చతీవు వివాదం చాలా క్లిష్టంగా మారిపోయింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Kathchatheevu Island
  • pm modi
  • Sri Lanka

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

    CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

  • Railway Employees

    Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd