HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Eye Opening Startling Pm Modi On Congress Giving Away Kathchatheevu Island To Sri Lanka

PM Modi : కాంగ్రెస్ వల్లే మన ద్వీపం లంక పాలైంది.. ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు

PM Modi : ఎన్నికలు సమీపించిన వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దక్షిణ భారతదేశంలో ఓ తేనెతుట్టెను కదిల్చారు.

  • By Pasha Published Date - 01:12 PM, Sun - 31 March 24
  • daily-hunt
Pm Modi
Pm Modi

PM Modi : ఎన్నికలు సమీపించిన వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దక్షిణ భారతదేశంలో ఓ తేనెతుట్టెను కదిల్చారు. మన దేశంలోని తమిళనాడులో ఉండాల్సిన కచ్చతీవు  (బంజరు ద్వీపం) ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన పాపం కాంగ్రెస్‌దే అని ఆయన ఆరోపించారు.  జనావాసాలు లేని 285 ఎకరాల కచ్చతీవు  ద్వీపం  భూభాగాన్ని 1974లో శ్రీలంకకు అప్పగించాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై  సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తు ద్వారా సేకరించిన సమాచారంతో ఈవిషయం వెలుగులోకి వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. కచ్చతీవు  ద్వీపాన్ని మన దేశం కోల్పోవడానికి ఆనాటి ఇందిరాగాంధీ సర్కారే కారణమన్నారు.

Eye opening and startling!

New facts reveal how Congress callously gave away #Katchatheevu.

This has angered every Indian and reaffirmed in people’s minds- we can’t ever trust Congress!

Weakening India’s unity, integrity and interests has been Congress’ way of working for…

— Narendra Modi (@narendramodi) March 31, 2024

We’re now on WhatsApp. Click to Join

దేశ సమగ్రత, ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ మొగ్గుచూపిందని ప్రధాని మోడీ(PM Modi) విమర్శించారు. ‘‘భారత సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో  ఉన్న 1.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కచ్చతీవు ద్వీపం ఒకప్పుడు రామనాథపురం జమిందారీ సంస్థానంలో భాగంగా ఉండేది. 1822లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ద్వీపాన్ని రామస్వామి సేతుపతి నుంచి లీజుకు తీసుకుంది. చట్టపరమైన హక్కులను కలిగి  ఉన్నప్పటికీ కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఆనాడు అప్పగించడం దారుణం’’ అని ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. “భారతీయులందరి కళ్లు తెరిపించే వాస్తవాలు బయటికొచ్చాయి. దేశ భూభాగాన్ని ఎంత ఈజీగా కాంగ్రెస్ వదిలేసిందో వెల్లడైంది.  ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించే విషయం. ఇక కాంగ్రెస్‌ను నమ్మలేమనే భావనకు దేశ ప్రజలు వచ్చారు. 75 ఏళ్ల పాలనలో దేశానికి కాంగ్రెస్ చేసింది ఇదే’’ అని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో కామెంట్ చేశారు.

Also Read :Easter Festival : ఇవాళే ఈస్టర్.. ఈ పండుగ ఆదివారమే ఎందుకొస్తుంది ?

‘‘కచ్చతీవు లాంటి చిన్న ద్వీపానికి నేను అంతగా ప్రాముఖ్యతను ఇవ్వను. దాని హక్కులపై భారత్ తరఫు వాదనలను వదులుకోవడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు’’ అని 1961 మే 10న నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చెప్పారనే విషయాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై  ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలో ఉంది. 

Also Read :Phone Tapping : ‘ఫోన్ ట్యాపింగ్’ దడ.. మీ ఫోన్ ట్యాప్ అయితే ఇలా గుర్తించండి

1983లో శ్రీలంకలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కచ్చతీవు   ద్వీపం భారతీయ తమిళ మత్స్యకారులు, సింహళ ఆధిపత్యమున్న లంక నౌకాదళం మధ్య పోరాటాలకు యుద్ధభూమిగా మారింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను అనుకోకుండా దాటినందుకు అప్పట్లో ఎంతోమంది భారతీయులను అరెస్టు చేసి జైళ్లలో వేశారు. అయితే ఈ  దీవిని భారత్‌కు లీజుకు ఇచ్చేలా శ్రీలంక ప్రభుత్వం చొరవ చూపాలంటూ అక్కడి సింహళీయ మత్స్యకారులు పలుమార్లు నిరసనకు దిగారు. అప్పటి నుంచి కచ్చతీవు వివాదం చాలా క్లిష్టంగా మారిపోయింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Kathchatheevu Island
  • pm modi
  • Sri Lanka

Related News

Maganti Sunitha

Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

గోపీనాథ్ మరణానంతరం కేటీఆర్ అద్భుతమైన రాజకీయ స్క్రిప్ట్ రాశారనే ప్రచారం జరిగింది. పి.జె.ఆర్. కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా 'సానుభూతి కార్డ్' పైనే ఉపఎన్నికల భవిష్యత్తును నిర్ణయించారు.

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • Harleen Deol Asks PM Modi

    Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

  • Jublihils Campign

    Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు

  • KCR appearance before Kaleshwaram Commission postponed

    KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

Latest News

  • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

  • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

  • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

  • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

  • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd