Sanghamitra Express: పట్టాలు తప్పిన సంఘమిత్ర ఎక్స్ప్రెస్!
- By Hashtag U Published Date - 11:46 AM, Thu - 22 June 23
ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల ఈపురుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. దీంతో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. రైలు పట్టా విరిగిపోయి ఉండటంతో చేనేత కార్మికుడు గద్దె బాబు అనే వ్యక్తి అటుగా వెళ్తూ గమనించారు. వెంటనే విషయాన్ని రైల్వే అధికారులకు చేరవేశారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు పలు రైళ్లను వేరే ట్రాక్పైకి మళ్లించారు. అదే ట్రాక్పై దానాపూర్ నుంచి బెంగళూరు సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ రైలు వెళ్తోంది.
రైల్వే అధికారులు పట్టాలు విరిగాయని ముందస్తు సమాచారం ఇవ్వడంతో రైలును నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. సంఘటన స్థలంకు చేరుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్ మరమ్మతు చర్యలు చేపట్టారు. మరమ్మతులు పూర్తిచేసిన అనంతరం సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలు బెంగళూరు బయలుదేరి వెళ్లనుంది. మరికొన్ని రైళ్లను వేరే ట్రాక్పైకి మళ్లించారు. రైల్వే అధికారుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది.
Related News
Beers Sales: మద్యం ప్రియులకు బిగ్ షాక్.. బెంగళూరులో బీర్ల కొరత, కారణమిదే
Beers Sales: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బెంగళూరు వాసులు వేడిని తట్టుకునేందుకు చల్లని బీర్ల వైపు మొగ్గుచూపడంతో డిమాండ్ పెరగడంతో ఎక్సైజ్ శాఖ అనూహ్యంగా అమ్మకాల లెక్కలతో సతమతమవుతోంది. ఏప్రిల్- మే నెలల్లో చివరి 11 రోజుల్లో 17 లక్షల లీటర్ల కోల్డ్ బీర్లు అమ్ముడయ్యాయని, మూడు సంవత్సరాల క్రితం 14.4 లక్షల లీటర్లు అమ్ముడుపోయిన గత రికార్డులను బద్దలు కొట్టిందని వెల్లడైంద