Karnataka: దళిత మహిళ నీరు తాగిందని..ఆవు మూత్రంతో ట్యాంక్ శుభ్రం చేసిన ఓ వర్గం..!!
- By hashtagu Published Date - 01:25 PM, Mon - 21 November 22
స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా… మనదేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, దాడులు తప్పడం లేదు. తాజాగా కర్నాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఒక దళిత మహిళ పబ్లిక్ కుళాయి నుంచి నీరు తాగింది. దీంతో ఆ గ్రామస్థులు ఆ ట్యాంకును ఆవు మూత్రంతో కడిగి శుభ్రం చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన దళితులు ఈ ఘటన పై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ లో వెలుగు చూసింది.
గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు దళిత మహిళ అక్కడికి వచ్చింది. లింగాయత్ వీధికి ఎదురుగా ఉన్న పబ్లిక్ కుళాయిలోని నీళ్లు తాగింది. దీన్ని అక్కడున్న వారు గుమనించారు. వెంటనే నీరు తాగుతున్న మహిళను అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత ఈ కుళాయి తెరిచి గోమూత్రంతో శుద్ధి చేశారు. ఇందంతా గమనించిన గ్రామంలోని కొందరు యువకులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ తోపాటు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ మహిళ ఫిర్యాదు ఇస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోనూ ఇలాంటి ఘటన వెలుగు చూసింది. ముగ్గురు యువకులు దళిత యువకుడిపై దాడి చేసి హత్య చేశారు.
Tags
Related News
Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదంలో తెలంగాణ
తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మరియు ఢిల్లీలలో రొమ్ము క్యాన్సర్ బారీన పడే వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు ఐసిఎంఆర్ వెల్లడించింది. భారతదేశంలో 2025 నాటికి ఈ ప్రభావం రెట్టింపు అయ్యే ప్రమాదం ఉన్నట్లు ఐసిఎంఆర్ అధ్యాయనం పేర్కొంది.