Teacher Burns Student: కర్ణాటకలో దారుణం.. యూనిఫాంలో మూత్రం పోసుకున్న బాలుడు, వేడి నీళ్లు పోసిన టీచర్!
- By Balu J Published Date - 09:36 PM, Fri - 9 September 22
2వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ యూనిఫాంలో మూత్రం పోసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన టీచర్ వేడినీళ్లు పోయడంతో 40 శాతం కాలిన గాయాలు అయ్యాయి. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని సంతేకల్లూర్ గ్రామంలో ఘనమఠేశ్వర గ్రామీణ సంస్థ నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలో గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. అఖిత్ అనే విద్యార్థిని లింగసగురు తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది. సీసీటీవీలో ఈ దారుణ ఘటన రికార్డ్ అయ్యింది.
అఖిత్ యూనిఫాంలో మలవిసర్జన చేశాడని తెలుసుకున్న ఉపాధ్యాయుడు హులిగెప్ప ఆగ్రహానికి గురై చిన్నారిపై వేడినీళ్లు పోశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయకుండా బాలుడి కుటుంబాన్ని కూడా బెదిరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అఖిత్ తల్లిదండ్రులకు స్థానిక నేతల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఫిర్యాదు చేస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేమని పోలీసులు తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా ఆస్పత్రిని సందర్శించి బాలుడి దీనస్థితిపై కన్నెత్తి చూడలేదు. ఘటన తర్వాత టీచర్ పాఠశాలకు రావడం మానేశాడు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న ఫోటోలు వైరల్గా మారాయి.
Related News
YS Sharmila : వైఎస్సార్ సీపీ ఆయువుపట్టుపై వైఎస్ షర్మిల ఫోకస్!
YS Sharmila : ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతం కోసం వైఎస్ షర్మిల తనదైన శైలిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.