శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ‘మెగాస్టార్’ దంపతులు..!
మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఆదివారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.
- By Hashtag U Published Date - 09:35 AM, Mon - 14 February 22
మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఆదివారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నానంటూ సామాజిక మాధ్యమమైన ట్విట్టర్లో శబరిమల యాత్రకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు చిరంజీవి. ‘చాలాకాలం తర్వాత శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాను. అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా కాలి నడకన కాకుండా డోలీలో స్వామి సన్నిధికి చేరుకోవాల్సి వచ్చింది. స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమను ధారపోస్తున్న డోలీ సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో చుక్కపల్లి సురేశ్, గోపీ కుటుంబాల తోడు మంచి అనుభూతినిచ్చింది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు చిరు.
Visiting #sabarimalatemple #feelingblessed pic.twitter.com/kdtfxXszcl
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 13, 2022
డోలీ కార్మికులకు మెగాస్టార్ ప్రత్యేక కృతజ్ఞతలు:
గత కొన్ని సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చిరుతో పాటు ఆయన కుమారుడు రామ్చరణ్ కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నారు. అయితే మండల పూజ, మకరజ్యోతి సమయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కుదరకపోవడంతోనే ఇప్పుడు చిరంజీవి దంపతులు శబరిమల యాత్రకు వెళ్లారు. కాగా డోలీలో శబరికొండకు చేర్చిన డోలీ కార్మికులకు మెగాస్టార్ చిరు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఇక మాస పూజ సందర్భంగా శనివారం సాయంత్రం అయ్యప్ప స్వామి దేవస్థానం తెరిచారు. ఈ నెల 17 వరకూ దేవాలయం తెరచి ఉంచనున్నారు.
Tags
Related News
Tollywood : హీరోలు జీరోలు..కమెడియన్స్ హీరోలు
టాలీవుడ్ (Tollywood) లో ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల పెద్దగా సక్సెస్ లు కొట్టలేకపోతున్నారు. దీనికికారణం మూస కథలను ఎంచుకోవడమే. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కథ కొత్తగా ఉంటె తప్ప థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడడం లేదు. ఎంత పెద్ద హీరోయినా..అభిమాన నటుడైన సరే కథ బాగుందా..కొత్త ఉందా అనేది చూస్తున్నారు. ఏమాత్రం బాగాలేదంటే రెండో రోజు నుండే థియేటర్స్ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఈ