Karnataka Politics : కర్నాటకలో ప్రాంతీయ వాదం.! పులకేశి Vs శివాజీ
కర్నాటకలోని ఓ ప్రచార బృందం ట్విట్టర్ వేదికగా ప్రారంభించిన పులకేశి 2 పాలనపై ప్రచారం రాజకీయాన్ని సంతరించుకుంది.
- By CS Rao Published Date - 05:08 PM, Sat - 4 December 21
కర్నాటకలోని ఓ ప్రచార బృందం ట్విట్టర్ వేదికగా ప్రారంభించిన పులకేశి 2 పాలనపై ప్రచారం రాజకీయాన్ని సంతరించుకుంది. శివాజీ కంటే పులకేశి కర్నాటక ఐకాన్ గా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. ఈ క్రమంలో తొలి నుంచి శివాజీని ఆరాధిస్తోన్న అధికార బీజేపీ ఇరకాటంలో పడిపోయింది. చారిత్రక ప్రచారానికి అనూహ్య మద్ధతు లభిస్తోంది. ఆ క్రమంలో కర్నాటక అంతటా పులకేశి 2 పాలన పై చర్చ జరుగుతోంది.
కర్నాటకలో బాదామి చాళుక్య రాజు ఇమ్మడి పులకేశి II పాలనపై జరుగుతోన్న ట్విట్టర్ ప్రచారం కన్నడ ప్రాంతీయవాదం దిశగా వెళుతోంది. నవంబర్ 28న కొందరు చరిత్ర ప్రియులు ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 610 నుండి 642 CE మధ్య వాతాపి (ప్రస్తుత బాదామి)ని రాజధానిగా చేసుకుని పాలించిన ఇమ్మడి పులకేశిని కీర్తిస్తూ వేలాది ట్వీట్లు వస్తున్నాయి. కన్నడేతర ప్రాంతాల నుండి “అరువుగా తీసుకున్న” చిహ్నాలను తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ ట్వీట్లను చేస్తున్నారు.
Chivaji Changigalige chali bidisida PULAKESHI putraru .
This was our first stint at an ideological level to counter Sanghis propoganda of infantilizing our native rulers while they blatantly eulogize rulers alien to Kannada land.
Going further our Movt ll be Multidimensional. https://t.co/tgGhJ9k8IJ
— RaNn_Silva (@Rann_Silva) December 4, 2021
17వ శతాబ్దపు మరాఠా రాజు శివాజీ వంటి “బయటి వ్యక్తులకు” బదులుగా కన్నడ రాజులను ప్రచారం చేసుకోవాలని ప్రచారం బృందం నొక్కిచెప్పింది. హిందూత్వ సంస్థలు, బిజెపి అత్యంత ప్రముఖ హిందూ చక్రవర్తిగా శివాజీని తరచుగా ప్రచారం చేస్తున్న విషయం విదితమే.పులకేశిపై పరిశోధనలకు నిధులు సమకూర్చాలని, ఆయన సాధించిన విజయాల గురించి అవగాహన పెంచుకోవాలని, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఇచ్చిన పిలుపు ప్రాంతీయ వాదాన్ని రేకెత్తిస్తోంది. అధికార BJP ,ప్రతిపక్ష కాంగ్రెస్ భిన్నరీతిగా ఈ ప్రచారంపై స్పందిస్తున్నాయి. ఇమ్మడి పులకేశి, అతని ‘కర్ణాటక బల’ సైన్యాన్ని మరియు ఉత్తర భారతదేశంలోని విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్న 7వ శతాబ్దపు పాలకుడు హర్షవర్ధనపై విజయంతో సహా అనేక విజయగాథల ఆధారంగా ప్రచారం జరుగుతోంది.“ఇమ్మడి పులకేశి విగ్రహం ఎక్కడా లేదు. బాదామి నుండి, అతను దక్షిణ-మధ్య భారతదేశం మొత్తాన్ని పాలించాడు. కర్ణాటక చరిత్రపై అవగాహన కల్పించాలనేది మా ఆలోచన’’ అని @NamHistory ట్విట్టర్ హ్యాండిల్ క్యూరేటర్ కిరణ్ మలెనాడు అంటున్నాడు. కిరణ్, తోటి చరిత్ర ఔత్సాహికులు మరియు సోషల్ మీడియా పేజీ క్యూరేటర్లు శివానంద గుండనవర, సునీల్ కుమార్, వివేక్ మరియు భువనేష్లతో కలిసి నవంబర్ 28న 30,000 కంటే ఎక్కువ ట్వీట్లను చూసే ప్రచారానికి నాయకత్వం వహించారు.
#DakshinaPateshwara #Parameshwara#ImmadiPulakeshi https://t.co/vl5SXZgNEO
— Dhananjaya (@Dhananjayaka) November 29, 2021
“కర్ణాటక చరిత్రలో సంవత్సరాలుగా ప్రభుత్వాలు చారిత్రక చిహ్నాలను నిర్లక్ష్యం చేశాయని ప్రచారం టీం ఆరోపిస్తోంది.ప్రచారానికి మద్దతుదారుల్లో ప్రముఖ కన్నడ నటుడు ధనంజయ్ కా కూడా జోడీ కట్టాడు. “కన్నడ మరియు సంస్కృతి, మరియు ఇంధన శాఖ మంత్రి, V. సునీల్ కుమార్, తమ శాఖ “డిమాండ్ను గమనించింది” అని చెప్పారు.ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ శాసనసభా పక్ష అధినేత సిద్ధరామయ్య కన్నడ రాజును సాంస్కృతిక చిహ్నంగా ఎంచుకోవాలనే డిమాండ్ కు జై కొట్టాడు. చాళుక్య చక్రవర్తి #ఇమ్మడిపులకేశిపై ప్రభుత్వం మరిన్ని పరిశోధనలు ప్రారంభించాలి. మహిమాన్వితమైన కర్ణాటకను పిల్లలు అర్థం చేసుకోవడానికి పులకేశి విజయాలు పాఠ్యాంశాల్లో చేర్చాలి, ”అని సిద్ధరామయ్య డిమాండ్ చేస్తున్నాడు. చాళుక్య రాజు “కర్ణాటకకు గర్వకారణం” అని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జి.సి. చంద్రశేఖర్ కూడా ట్విట్టర్లో ప్రచారంలో పాల్గొన్నారు. శివాజీ, ఇమ్మడి పులకేశి మధ్య పోలికలు బీజేపీలోని కొందరికి మింగుడు పడలేదు.“వారు సమకాలీనులా? ఎందుకు పోలిక ఉండాలి? వారు ప్రాంతీయవాదం అంటారు కానీ ఇది జాతీయవాదానికి వ్యతిరేకం. అప్పుడు భాష గురించి గొడవలు లేవు. హర్ష యుద్ధంలో గెలిచినా, పులకేశి గెలిచినా, ఇద్దరూ దేవాలయాలు నిర్మించారు, ”అని బిజెపి సీనియర్ నాయకుడు ఒకరు సర్థి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. “ప్రస్తుతం, కర్ణాటకలో బలమైన స్టేట్ ఐకాన్ లేదు, కాబట్టి ఈ ధోరణి ప్రారంభమైతే, దానిని తీవ్రంగా పరిగణించాలని రాజకీయ మేధావులు భావిస్తున్నారు.
Related News
Sumalatha – BJP : ‘మాండ్య’ను త్యాగం చేసిన సుమలత.. బీజేపీలోకి చేరిక
Sumalatha - BJP : ప్రముఖ నటి సుమలత కీలక నిర్ణయం తీసుకున్నారు.