Delhi : ఢిల్లీ మేయర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్
ఢిల్లీలో మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి హర్ష్ మల్హోత్రా
- By Prasad Published Date - 08:13 AM, Wed - 19 April 23
ఢిల్లీలో మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి హర్ష్ మల్హోత్రా సమక్షంలో కార్పొరేషన్ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థి సోనీ పాండే కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా.. రెండోసారి కౌన్సిలర్గా ఎన్నికైన శిఖా రాయ్ను మేయర్ పదవికి నామినేట్ చేశారు. 249 వార్డు నుండి కౌన్సిలర్ అయిన సోని పాండేని డిప్యూటీ మేయర్ పదవికి నామినేట్ చేశారు. గ్రేటర్ కైలాష్-1 వార్డు కౌన్సిలర్ గా శిఖరాయ్ గెలిచారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోమవారం ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ ఆలే మొహమ్మద్ ఇక్బాల్లను ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో రెండవసారి తన అభ్యర్థులుగా నామినేట్ చేసింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు షెల్లీ ఒబెరాయ్, ఆలే మహమ్మద్ ఇక్బాల్ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక ఏప్రిల్ 26న జరగనుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కోసం తన విజన్ లెటర్ను అందరి కార్పొరేటర్ల ముందు అందజేస్తానని, దాని ఆధారంగా కార్పొరేటర్లందరి మద్దతు కోరతానని శిఖా రాయ్ చెప్పారు. మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం MCD సమావేశం ఏప్రిల్ 26 న జరగనుంది. షెల్లీ ఒబెరాయ్ ఫిబ్రవరి 22న ఢిల్లీ మేయర్గా ఎన్నికయ్యారు మరియు AAP తమ అభ్యర్థుల గెలుపు కోసం సిద్ధంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేసింది.
Tags
Related News
TS Poll : రాష్ట్రంలో కాంగ్రెస్ లూటీ స్టార్ట్ అయ్యింది – కేటీఆర్
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ కేంద్ర నిధులు తీసుకొచ్చారా అని నిలదీశారు. అమిత్షా చెప్పులు మోయడం తప్ప సంజయ్ ఒక్కపనైనా చేశారా అని ఎద్దేవా చేశారు