Peafowls: కోయంబత్తూరులో దారుణం.. విషప్రయోగంతో 31 నెమళ్లు మృతి
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 31 నెమళ్లు విషప్రయోగంతో చనిపోయిన సంఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది.
- By Balu J Published Date - 01:17 PM, Sat - 21 October 23
Peafowls: కోయంబత్తూరులోని సుల్తాన్పేటైలో వ్యవసాయ భూముల్లో 31 నెమళ్లు చనిపోయాయి. పక్షులకు విషప్రయోగం చేసి ఉండొచ్చని అటవీశాఖ ప్రాథమిక విచారణలో తేలింది. సుల్తాన్పేటై సమీపంలోని గాంధీనగర్లోని వ్యవసాయ భూముల్లో పెద్ద సంఖ్యలో నెమళ్లు చనిపోయాయని సుల్తాన్పేట పోలీసులు మదుక్కరై ఫారెస్ట్ రేంజ్లోని అధికారులను అప్రమత్తం చేశారు. మదుక్కరై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి సంధియా నేతృత్వంలోని బృందం నలుగురు రైతులకు చెందిన భూముల్లో 31 పక్షుల కళేబరాలను గుర్తించింది.
వారు మృతదేహాలను మదుక్కరై ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. కోయంబత్తూరులోని జిల్లా అటవీ అధికారి (DFO) N జయరాజ్ మాట్లాడుతూ “మేం పక్షుల నమూనాలను చెన్నైలోని ఒక ల్యాబ్కి మరియు సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ (SACON)కి కూడా పంపాం. నివేదిక అంచనా ప్రకారం పక్షులకు విషం ఇచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది.
Tags
Related News
Lokesh : తమిళనాడులో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
Nara Lokesh: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తమిళనాడులో(Tamil Nadu) ఎన్నికల ప్రచారం(Election campaign)నిర్వహించనున్నారు. టీడీపీ ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మారిన నేపథ్యంలో… కోయంబత్తూరు(Coimbatore) ఎంపీ అభ్యర్థి, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి(Annamalai Kuppuswamy)కి మద్దతుగా నారా లోకేశ్ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ నేపథ్యంలో, లోక�