AP CM Jagan: ఏపీలో ప్లాస్టిక్ బ్యానర్స్ నిషేధం
శుక్రవారం బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
- By Balu J Published Date - 05:36 PM, Fri - 26 August 22
శుక్రవారం బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పర్యావరణహిత బ్యానర్లను వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 28 కిలోమీటర్ల బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో 20 వేల మంది పాల్గొని 76 వేల టన్నుల ప్లాస్టిక్ను సేకరించారని సీఎం చెప్పారు.
మహాసముద్రాలు, సముద్రాల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు సీఎం సమక్షంలోనే ఎన్జీవో పార్లే ఫర్ ఓషన్స్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2022 నుంచి ఆరేళ్లపాటు చెల్లుబాటవుతుంది. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని టీటీడీ విజయవంతంగా అమలు చేస్తోందని జగన్ రెడ్డి పేర్కొన్నారు. సభలు, కార్యక్రమాల్లో ఖర్చుతో కూడుకున్న బ్యానర్లను ఉపయోగించాలని ప్రజలను కోరారు. 2027 నాటికి ఏపీ ప్లాస్టిక్ రహితంగా మారాలని ఆకాంక్షించారు. ఏపీలో 20 వేల ఉద్యోగాలు కల్పించే పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ ఇదే వేదికపై ముఖ్యమంత్రి ప్రకటన. కేవలం క్లాత్తో తయారుచేసే ఫ్లెక్సీలకే అనుమతి అని స్పష్టంచేసిన సీఎం pic.twitter.com/sbJXy3nMsY
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 26, 2022
Related News
AP DGP Transfer: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీ బదిలీ
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని తెలిపింది.