Delhi : ఢిల్లీలో దారుణం.. వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి
ఢిల్లీలోని వసంత్ కుంజ్లో దారుణం జరిగింది. వీధికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
- By Prasad Published Date - 07:23 AM, Mon - 13 March 23
ఢిల్లీలోని వసంత్ కుంజ్లో దారుణం జరిగింది. వీధికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఆనంద్ (7), ఆదిత్య (5) తమ తల్లిదండ్రులతో కలిసి సింధీ బస్తీలోని స్లమ్ క్లస్టర్లో నివసిస్తున్నారని వారు తెలిపారు. మార్చి 10న, మధ్యాహ్నం 3 గంటలకు ఆనంద్ తప్పిపోయాడని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత SHO వసంత్ కుంజ్ (దక్షిణం) పోలీసు బృందంతో పాటు బాలుడి కుటుంబం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్లమ్ క్లస్టర్కు ఆనుకుని ఉన్న అడవిలో రెండు గంటలపాటు సుదీర్ఘ శోధన తర్వాత, ఏకాంత ప్రదేశంలో గోడకు సమీపంలో మైనర్ మృతదేహం కనుగొనబడిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పిల్లల శరీరంపై జంతువుల కాటులాగా అనేక గాయాల గుర్తులు ఉన్నాయని అధికారి తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. అడవి ప్రాంతంలో చాలా వీధికుక్కలు ఉన్నాయని.. ఇవి తరచుగా ఆ ప్రాంతంలో మేకలు, పందులపై దాడి చేస్తాయని పోలీసులు తెలిపారు.
వసంత్ కుంజ్ సౌత్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 302 (హత్య) కింద కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల తర్వాత, మార్చి 12న, ఆనంద్ తమ్ముడు ఆదిత్య తన బంధువు చందన్ (24)తో కలిసి ప్ర అదే అడవి ప్రాంతానికి వెళ్లాడని పోలీసులు తెలిపారు. చందన్ కొద్దిసేపటికి ఆదిత్యను విడిచిపెట్టి వచ్చాడని.. ఆ సమయంలో అక్కడ చుట్టూ వీధికుక్కలు ఉన్నాయని వారు తెలిపారు. ఆదిత్య కూడా వీధి కుక్కల దాడిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని, శవపరీక్ష నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Related News
Delhi Lok Sabha Elections 2024: ఆప్ కి ఓటు వేయనున్న రాహుల్ గాంధీ
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారని, రెండు మిత్రపక్షాల మధ్య బలమైన బంధానికి గుర్తుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ అభ్యర్థికి నేను ఓటేస్తానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.