Women Investors: 60% మహిళా పెట్టుబడిదారుల మొగ్గు అటువైపే.. ఎందుకు..? ఏమిటి..?
మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు.. పైలట్ పోస్ట్ నుంచి రాష్ట్రపతి పోస్ట్ దాకా ప్రతి పోస్ట్ కు మహిళలు పోటీ పడుతున్నారు.
- By Maheswara Rao Nadella Published Date - 07:00 PM, Sun - 26 March 23
Women Investors : మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు.. పైలట్ పోస్ట్ నుంచి రాష్ట్రపతి పోస్ట్ దాకా ప్రతి పోస్ట్ కు మహిళలు పోటీ పడుతున్నారు. జాబ్స్, వ్యాపారాలు చేసే మహిళల సంఖ్య కూడా పెరిగింది.. అయితే తమ సేవింగ్స్ ను ఎక్కడ దాచాలి? అనే దానికి మహిళలు
ఇప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్లు , పొదుపు ఖాతాల వైపే మొగ్గు చూపుతున్నారట.
ఎప్సిలాన్ మనీ, ఇంటిగ్రేటెడ్ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ, వారి దీర్ఘకాలిక ఆర్థిక అవగాహన కార్యక్రమం ‘ఫైనాన్స్ దివా’ ప్రారంభానికి పూర్వగామిగా మహిళా పెట్టుబడిదారులపై నిర్వహించిన సర్వేలో ఈవివరాలు వెల్లడయ్యాయి. 60% మహిళా పెట్టుబడిదారులు ఇప్పటికీ సాంప్రదాయ పెట్టుబడి మార్గాలనే నమ్ముతున్నారని తేలింది. దాదాపు సగం మంది మహిళలు (47%) తమ ఆదాయంలో 10-30% మధ్య భవిష్యత్ ఆర్ధిక అవసరాల కోసం వివిధ చోట్ల సేవ్ చేస్తున్నారు. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు పొదుపు ఖాతాలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. 60% మంది మహిళా పెట్టుబడిదారులు భద్రత ఎక్కువ ఉంటుందనే నమ్మకంతోనే సాంప్రదాయ పెట్టుబడిసాధనాలను ఎంపిక చేసుకుంటున్నారు. భారతదేశంలోని 37 నగరాల మహిళలు (Women) ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 33% మంది టైర్ II , టైర్ III నగరాలకు చెందినవారు కావడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న వారిలో 60% మంది 18- 30 ఏళ్లలోపు వారు. 31-45 ఏళ్లలోపు వారు 32% మంది.. 7% మంది 45-60 ఏళ్లలోపు వారు, 1 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
జీవిత లక్ష్యాల కోసం..
సర్వేలో పాల్గొన్న మహిళల్లో 49% మంది ఉద్యోగులు ఉన్నారు. మిగిలిన 16% మంది స్వయం ఉపాధి పనులు చేసేవారు, మరో 12% మంది నిపుణులు ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 23% మంది గృహిణులు ఉన్నారు.44% మంది మహిళలు తమ స్వంత ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో నమ్మకంగా ఉన్నారు. అయితే గణనీయమైన 56% మంది.. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకుంటారు.
సర్వే ఫలితాల ప్రకారం, పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మహిళలు స్వీయ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇల్లు కొనడం, పిల్లల చదువులు/వివాహం , పదవీ విరమణ వంటి లక్ష్యాలతో మహిళలు ఉన్నారు.
Also Read: Glory of Sri Rama: శ్రీరామ నామ మహిమ
Related News
Lok Sabha Elections 2024: ముగిసిన తొలి దశ పోలింగ్, ఎక్కడ, ఎంత శాతం పోలింగ్ అయింది?
దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మొదటి దశ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఎండని సైతం లెక్క చేయకుండా రోజంతా ఓటు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్లో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.