Kerala : కేరళ నరబలి కేసులో వెలుగులోకి మరికొన్ని సంచలన విషయాలు..!!
కేరళ నరబలి కేసు..దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసు దర్యాప్తులో మరెన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- By hashtagu Published Date - 05:20 AM, Fri - 14 October 22
కేరళ నరబలి కేసు..దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసు దర్యాప్తులో మరెన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాతనంతిపట్ట జిల్లా ఎలంతూరులో జరిగిన ఈ నరబలి కేసు దర్యాప్తులో భాగంగా…అక్టోబర్ 11న వెలికితీసిన ఇద్దరు మహిళల శవాలకు గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. అంతకుముందు తీసుకువచ్చని శవాలకు కూడా కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది.
బాధితుల్లో ఒకరైన రోస్లిన్ అస్థిపంజరం మాత్రమే లభ్యమయ్యింది. రెండో బాధితురాలు పద్మ మృతదేహం 56 ముక్కలుగా లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. “రోస్లిన్ పోస్ట్మార్టం బుధవారం పూర్తవ్వగా… గురువారం పద్మ మృతదేహంపై పోస్టుమార్టం పూర్తి చేసారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వైద్య విచారణలో జాప్యం జరిగినట్లు అదికారులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం విధివిధానాలు పూర్తి చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు. అయితే డీఎన్ఏ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
నిందితులు వారిలో ఒకరి రొమ్ములను కోయగా…మరొకరి శరీరాన్ని 56 ముక్కలుగా నరికారు. వీరిద్దరూ దారుణ హింసకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ షఫీ, భగవల్ సింగ్ అతని భార్య, మసాజ్ థెరపిస్ట్ లైలా లకు కోర్టు గురువారం 12 రోజుల కస్టడీకి అప్పగించింది. “భగవల్ సింగ్, అతని భార్య లైలాకు దేవతను ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలో శ్రేయస్సు తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే నిందితులు నరబలిని నిర్వహించడానికి కుట్ర పన్నినట్లు రిమైండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఎలంతూరు గ్రామంలోని దంపతుల ఇంటి పరిసరాల్ధలో బుధవారం నరికిన మృతుల శరీర భాగాలను వెలికితీశారు. సెప్టెంబర్ 26న మొదటి మహిళ కనిపించకుండా పోవడంతో షఫీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ముగ్గురూ జూన్లో రెండవ బాధితుడిని ఇదే విధంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈకేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అయితే బాధితులు ఎక్కువ మంది ఉండే అవకాశమున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో వివాహేతర సంబంధ కోణం దాగివుందనేదానిపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ షఫీ తర్వాత టార్గెట్ లైలా భర్త భగవల్ సింగ్ అయ్యుంటాడన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షఫీ ఆమెతో కలిసి జీవించేందుకు కుట్రకు పన్నాగం చేసి ఉంటాడన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు
Related News
Durga Temple: ఈ దుర్గా మాత ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తారట..! ఆ టెంపుల్ విశేషాలివే..!
దుర్గా మాత (Durga Temple) పురాతన ఆలయం కేరళలోని మలప్పురంలో ఉన్న ముత్తువల్లపర్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తుంటారు.