UP: యూపీలో ఉద్రిక్తత…మసీదులో మతగ్రంథాలు దహనం..!!
- By hashtagu Published Date - 05:10 AM, Thu - 3 November 22
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మసీదులో మత గ్రంథాలు దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో పోలీసులు భారీ మోహరించారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు రాళ్లు రువ్వారు. వస్తువులకు వీదుల్లో నిప్పంటించి నిరసన తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కబెట్టారు.
మత గ్రంథాలను తగులపబెట్టిన అనంతరం గుర్తు తెలియని దుండగుడు మసీదు నుంచి బయటకు వెళ్లాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో వందలాది మంది ప్రజలు రోడ్డుపై వచ్చి ఆందోళన చేశారు. దీంతో షాజన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఎస్సీ ఎస్ ఆనంద్ తెలిపారు.
UP| We received info that a few desecrated pages of a religious scripture were found at a religious place under Kotwali PS limits. Police reached the spot, talked to people & filed a case. We're examining CCTV footage too. Police force deployed at spot: Shahjahanpur SP S Anand pic.twitter.com/dOM4Gz8Udl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 2, 2022
మసీదు దగ్గర నిరసనకారులు ఆందోళన చేపట్టడంతో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతాన్నంతా పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.
Tags
Related News
Rahul Gandhi Nomination: రాహుల్ గాంధీ నామినేషన్ కోసం యూపీకి బయల్దేరిన సీఎం రేవంత్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏఐసీసీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి శుక్రవారం హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు