Twitter : బిగ్ షాక్..బ్లూ టిక్ కు మాత్రమే కాదు.. ట్విట్టర్ యూజర్లందరూ ఛార్జ్ చెల్లించాల్సిందే..!!
- By hashtagu Published Date - 10:04 AM, Wed - 9 November 22
ట్విట్టర్ ను ఎలన్ మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత ఎన్నో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. సీఈవో నుంచి కామన్ ఎంప్లాయిస్ వరకు ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. బ్లూ టిక్ కావాలంటే యూజర్లు ఛార్జీ చెల్లించాల్సిందేనని ప్రకటించారు. అయితే ఇప్పుడు యూజర్లకు మరో బిగ్ షాక్ ఇచ్చాడు మస్క్. ట్విట్టర్ వినియోగదారులందరూ ఛార్జ్ చెల్లించాల్సిందేనని బాంబ్ పేల్చాడు.
మస్క్ ఈ మధ్య కాలంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కానీ యూజర్లందరికీ ఛార్జ్ ప్రకటించినట్లయితే…ఎన్నో మార్పులు వస్తాయి. మస్క్ వినియోగదారుల నుంచి సబ్ స్క్రిప్షన్ ఫీజులను వసూలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ట్విట్టర్ ఫ్లాట్ ఫామ్ నివేదిక పేర్కొంది. ట్విట్టర్ వినియోగదారులందరూ కూడా ట్విట్టర్ ను వినియోగించాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందేనని నివేదిక పేర్కొంది. అయితే ట్విట్టర్ బ్లూ టిక్ కోసం యూజర్లు ప్రత్యేక ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ట్విట్టర్ బ్లూ టిక్ తోపాటు వినియోగదారులకు ఇతర అదనపు ఫీచర్లను అందిస్తారు.
ఈ మధ్య కంపెనీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన మస్క్…ఈ అంశాన్ని చర్చకు తీసుకువచ్చినట్లు సమాచారం యూజర్లు ఒక నెలలో పరిమిత సమయం మాత్రమే ట్విట్టర్ ను ఉపయోగించాలని నివేదిక పేర్కొంది. పరిమిత సమయం ముగిసిన తర్వాత యూజర్లు కంపెనీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకున్న తర్వాతే..యూజర్లకు యాక్సెస్ ఇస్తారు. అయితే ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మస్క్ దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ట్విట్టర్ ఇంజనీర్లు బ్లూ సబ్ స్క్రిప్షన్ పై పనిచేస్తున్నారు. దీని కారణంగా ఫ్లాట్ ఫాం యూజర్ల నుంచి డబ్బు వసూలు చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు.
కాగా మస్క్ ఇప్పటికే చాలా దేశాల్లో ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ ను వసూలు చేస్తున్నారు. ఇది ఇంకా భారత యూజర్లకు అందుబాటులోకి రాలేదు. ఒక నెలలోపు యూజర్లందరికీ రిలీజ్ చేస్తామని మస్క్ ఇప్పటికే వెల్లడించారు.
Related News
Elon Musk Net Worth Rise: మస్క్తో మామూలుగా ఉండదు మరీ.. 5 రోజుల్లో రూ. 3 లక్షల కోట్లు సంపద..!
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నికర విలువ సోమవారం నాడు 18.5 బిలియన్ డాలర్లు పెరిగింది.