HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Off Beat
  • >Kashmir Problem Cannot Be Solved By One Person Modi Got Angry Without Mentioning Nehrus Name

PM MODI : కశ్మీర్ సమస్యను ఒక వ్యక్తి పరిష్కరించలేడు…నెహ్రూ పేరు ప్రస్తావించకుండా మండిపడ్డ మోదీ..!!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

  • By hashtagu Published Date - 09:07 AM, Tue - 11 October 22
  • daily-hunt
Modi Meeting
Modi Meeting

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కాగా సోమవారం ప్రసంగించిన మోదీ నెహ్రూపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పూర్వపు సంస్థానాల విలీనానికి సంబంధించిన అన్ని సమస్యలను సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిష్కరించారని అన్నారు. కానీ “ఒక వ్యక్తి” కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోయాడు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కాశ్మీర్ సమస్యలకు నేను సర్దార్ పటేల్ అడుగుజాడల్లో నడవడం వల్లే పరిష్కారాన్ని కనుగొనగలిగాను. సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అర్బన్ నక్సలైట్లు తమ శాయశక్తులా ప్రయత్నించారని ప్రధాని మోదీ అన్నారు.

కాంగ్రెస్‌పై మండిపడ్డ మోదీ:
ఆనంద్ జిల్లాలోని వల్లభ్ విద్యానగర్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ నేతలను కలిసినప్పుడు సర్దార్‌ పటేల్‌ గౌరవార్థం ఏనాడైనా స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీని సందర్శించారా అని ప్రశ్నించాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగానే దీని నిర్మాణ తీర్మానాన్ని బీజేపీ తీసుకుందని తెలిపారు. సర్దార్ పటేల్‌కు సముచితమైన గౌరవం ఇవ్వడమే దీని ఉద్దేశమన్నారు మోదీ. కేవడియాలో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం ప్రపంచానికే గర్వకారణమన్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మాత్రమే కాకుండా, మహాత్మా గాంధీ గౌరవార్థం తమ ప్రభుత్వం చారిత్రక దండి మార్చ్ మొత్తం మార్గాన్ని కూడా అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు. గాంధీ పేరుతో ఏళ్ల తరబడి రాజకీయాలు చేసిన వారు ఏనాడూ పట్టించుకోలేదు. మేము కూడా దీన్ని చేయాల్సి వచ్చిందన్నారు మోదీ.

అర్బన్ నక్సలైట్లు గుజరాత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు:
విదేశీ శక్తుల సహాయంతో అర్బన్ నక్సలైట్లు గుజరాత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.. దేశంలోని అనేక రాష్ట్రాలు, బెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో నక్సలైట్లు చేతిలో తుపాకులు పెట్టి గిరిజన యువత జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. గుజరాత్‌లోని ఆదివాసీ యువకులు అభివృద్ధి కోసం నా మాటకు కట్టుబడి అర్బన్ నక్సలైట్ల పథకాలను తిప్పికొట్టారని గుర్తు చేశారు. భరూచ్‌లో రూ.2506 కోట్ల విలువైన బల్క్ డ్రగ్ పార్క్ సహా పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు మోదీ.

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gujarath
  • Kashmir Issue
  • modi
  • Nehru
  • sardar patel

Related News

Gst 2.0

GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

GST 2.0 : ఈ కొత్త విధానం వల్ల ఆర్థిక లోటుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కూడా స్పష్టం చేశారు. జీఎస్టీ 2.0 అనేది ఆర్థిక వ్యవస్థను మరింత సరళీకృతం చేసి, పారదర్శకతను పెంచేందుకు ఉద్దేశించిన ఒక ముఖ్యమైన సంస్కరణగా చెప్పవచ్చు

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

  • Modi Mother

    Modi : చనిపోయిన నా తల్లిని అవమానించారు- ప్రధాని ఆవేదన

Latest News

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd