PM MODI : కశ్మీర్ సమస్యను ఒక వ్యక్తి పరిష్కరించలేడు…నెహ్రూ పేరు ప్రస్తావించకుండా మండిపడ్డ మోదీ..!!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
- By hashtagu Published Date - 09:07 AM, Tue - 11 October 22
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కాగా సోమవారం ప్రసంగించిన మోదీ నెహ్రూపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పూర్వపు సంస్థానాల విలీనానికి సంబంధించిన అన్ని సమస్యలను సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిష్కరించారని అన్నారు. కానీ “ఒక వ్యక్తి” కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోయాడు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కాశ్మీర్ సమస్యలకు నేను సర్దార్ పటేల్ అడుగుజాడల్లో నడవడం వల్లే పరిష్కారాన్ని కనుగొనగలిగాను. సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అర్బన్ నక్సలైట్లు తమ శాయశక్తులా ప్రయత్నించారని ప్రధాని మోదీ అన్నారు.
కాంగ్రెస్పై మండిపడ్డ మోదీ:
ఆనంద్ జిల్లాలోని వల్లభ్ విద్యానగర్లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలను కలిసినప్పుడు సర్దార్ పటేల్ గౌరవార్థం ఏనాడైనా స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారా అని ప్రశ్నించాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగానే దీని నిర్మాణ తీర్మానాన్ని బీజేపీ తీసుకుందని తెలిపారు. సర్దార్ పటేల్కు సముచితమైన గౌరవం ఇవ్వడమే దీని ఉద్దేశమన్నారు మోదీ. కేవడియాలో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం ప్రపంచానికే గర్వకారణమన్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మాత్రమే కాకుండా, మహాత్మా గాంధీ గౌరవార్థం తమ ప్రభుత్వం చారిత్రక దండి మార్చ్ మొత్తం మార్గాన్ని కూడా అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు. గాంధీ పేరుతో ఏళ్ల తరబడి రాజకీయాలు చేసిన వారు ఏనాడూ పట్టించుకోలేదు. మేము కూడా దీన్ని చేయాల్సి వచ్చిందన్నారు మోదీ.
అర్బన్ నక్సలైట్లు గుజరాత్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు:
విదేశీ శక్తుల సహాయంతో అర్బన్ నక్సలైట్లు గుజరాత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.. దేశంలోని అనేక రాష్ట్రాలు, బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో నక్సలైట్లు చేతిలో తుపాకులు పెట్టి గిరిజన యువత జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. గుజరాత్లోని ఆదివాసీ యువకులు అభివృద్ధి కోసం నా మాటకు కట్టుబడి అర్బన్ నక్సలైట్ల పథకాలను తిప్పికొట్టారని గుర్తు చేశారు. భరూచ్లో రూ.2506 కోట్ల విలువైన బల్క్ డ్రగ్ పార్క్ సహా పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు మోదీ.
Related News
Rashmika : మోడీకి దగ్గరైన రష్మిక..
ముంబైలోని అటల్ సేతు మార్గం నిర్మాణం, దేశంలోని యువ భారత్ కలల గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.