Akshaya Tritiya 2022 :ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకోవాలి..!!
అక్షయ తృతీయ...హిందువులకు ఈ పండగ చాలా ప్రత్యేకమైంది. అక్షయ తృతీయనాడు విలువైన వస్తువులు బంగారం, వెండి కొనుగోలు చేస్తే తమ జీవితాల్లో తప్పులు, అప్పులు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అక్షయ తృతీయకు మరోపేరు కూడా ఉంది.
- By Hashtag U Published Date - 11:39 AM, Fri - 29 April 22
అక్షయ తృతీయ…హిందువులకు ఈ పండగ చాలా ప్రత్యేకమైంది. అక్షయ తృతీయనాడు విలువైన వస్తువులు బంగారం, వెండి కొనుగోలు చేస్తే తమ జీవితాల్లో తప్పులు, అప్పులు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అక్షయ తృతీయకు మరోపేరు కూడా ఉంది. అదే అఖా తీజ్. అక్షయ తృతీయ అక్షరార్థం ‘అంతులేని శ్రేయస్సు’ అని. వసంత రుతువులో ఈ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్ల పక్షం మూడవ రోజున వైశాఖ మాసంలో ఈ పండగ వస్తుంది.
భారత్ తోపాటు నేపాల్ దేశాల్లోని హిందువులు, జైనులు తమ ఇంట్లోకి అదృష్టం, శ్రేయస్సును ఆహ్వానించడానికి ఈ పండుగను జరుపుకుంటారు. 2022లో అక్షయ తృతీయను ఏ రోజున జరుపుకోవాలన్న సందేహం ఉంది. మే 3న (మంగళవారం) లేదా మే 4 (బుధవారం) తేదీలు అక్షయ తృతీయ పండుగకు అనుమైనవిగా పురోహితులు చెబుతున్నారు. తెలుగు సంవత్సర క్యాలెండర్ ప్రకారం చూస్తే తదియ తిధి మే 3న ఉదయం 5:19 నిమిషాల నుంచి మే 4 బుధవారం ఉదయం 7:33 నిమిషాల వరకు ఉంది.
మే 3నే అక్షయ తృతీయను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఆ రోజునే పూజా కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 :18 నిమిషాల వరకు శుభముహుర్తం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలోనే పూజను పూర్తి చేయాలని అంటున్నారు. కానీ, బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం మే 3 ఉదయం 5 గంటల నుంచి మే 4 ఉదయం 7 గంటల వరకు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.
ఇక అక్షయ తృతీయ రోజు లక్ష్మిదేవితో పాటు కుబేరులను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు తమను వరిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే విధంగా సకల సౌకర్యాలు, సుఖ:శాంతుల కోసం పసుపు, కుంకుమ, మంచం, మారేడు దళాలు, వస్త్రాలను దానం చేస్తే అంతా మంచి జరుగుతుందని హిందుల నమ్మకం. కొందరు కుంకుమ, తులసి ఆకులు, కర్పూరం, తులసి, తమలపాకులతో పాటు నీటితో నింపిన కంచు లేదా వెండి పాత్రలను దానం చేస్తారు. అలాగే మధుసూదన ఆచారం, తులసి పూజ మరియు విష్ణు సహస్రనామం జపించినట్లయితే అంత మంచి జరుగుతుందని అంటుంటారు.
Related News
Gold Prices: ఈ ఏడాది బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్.. రూ.70 వేలకు గోల్డ్..?
రాబోయే 2024లో కూడా బంగారం ఆధిపత్యం కొనసాగుతుందని అంచనా. 10 గ్రాముల బంగారం ధర (Gold Prices) రూ.70 వేలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు.