Indigo Airlines : ఇండిగో ఎయిర్ లైన్స్ అతి
ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల మధ్య ఉన్న చిన్నారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇండిగో ఎయిర్ లైన్స్ మీద DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది.
- By CS Rao Published Date - 08:00 PM, Sat - 28 May 22
ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల మధ్య ఉన్న చిన్నారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇండిగో ఎయిర్ లైన్స్ మీద DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. అసాధారణ పరిస్థితుల్లో ఉన్న చిన్నారి బోర్డింగ్ ను నిరాకరించిన ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ. 5లక్షల జరిమానా విధించింది. మరోసారి ఇలాంటి తప్పు చేయడానికి లేదని హెచ్చరించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
రాంచీ విమానాశ్రయంలో నరాలకు సంబంధించిన సమస్యతో చిన్నారి ఇబ్బంది పడ్డారు. విమానాశ్రయానికి కారులో రావడంతో అతని ప్రతిస్పందన అసాధారణంగా మారింది. విమానాశ్రయంలో బోర్డింగ్ సమయంలో ఇండిగో సిబ్బంది అనుమతిని నిరాకరించారు. మే 7న రాంచీ విమానాశ్రయంలో జరిగిన ఈ సంఘటన వీడియో రికార్ట్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎయిర్ లైన్స్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
సంఘటనపై పూర్తి విచారణను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విచారణ చేసింది. సంఘటన జరిగినప్పుడు అక్కడికక్కడే ఉన్న అభినందన్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం, పిల్లవాడు విమానాశ్రయానికి కారులో ప్రయాణించడానికి అసౌకర్యంగా ఉన్నాడు. బోర్డింగ్ గేట్ వద్దకు రాగానే ఒత్తిడికి లోనయ్యాడు. అయితే అతని తల్లిదండ్రులు కొంత ‘ఆహారం ఇవ్వడంతో పాటు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బోర్డింగ్ సమయంలో, పిల్లవాడు ‘సాధారణంగా’ ప్రవర్తిస్తే తప్ప పిల్లవాడిని విమానం ఎక్కనివ్వబోమని ఇండిగో మేనేజర్ కుటుంబాన్ని హెచ్చరించాడు.
చిన్నారి పరిస్థితిని (టీనేజ్ దృఢత్వం) తాగిన ప్రయాణీకుల పరిస్థితితో పోల్చి, అతనిని వారి విమానంలో ప్రయాణించడానికి అనర్హుడని భావించాడు. అతని చర్యను పలువురు సహ ప్రయాణీకులు వ్యతిరేకించినప్పటికీ, మేనేజర్ చలించలేదు. అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రూ. 5లక్షల జరిమానా విధిస్తూ DGCAనిర్థారించింది.
Related News
Air India Flight: ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం.. 180 మంది ప్రయాణికులు సేఫ్
మహారాష్ట్రలోని పూణె విమానాశ్రయంలో గురువారం (మే 16) పెను ప్రమాదం తప్పింది.