Tandoori Masala Powder : హోటల్ స్టైల్ తందూరి మసాలా పౌడర్.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
ఇది చాలా ఘాటుగా, మంచి వాసనతో ఉంటుంది. కేవలం తందూరి వంటకాల్లోనే కాదు.. బిర్యానీ, ఇతర నాన్ వెజ్ వంటకాల్లో కూడా వాడుకోవచ్చు. తందూరి మసాలాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ?
- By News Desk Published Date - 04:30 PM, Sat - 14 October 23
Tandoori Masala Powder : మనం ఎన్నిసార్లు ఇంట్లో బిర్యానీ వండినా.. హోటల్ స్టైల్ లో రాదు. ఎప్పుడో ఒకసారి గానీ ఆ టేస్ట్ వస్తుంది. కారణం.. మనం మార్కెట్లో ఇన్ స్టంట్ గా లభించే మసాలా పొడులను వాడుతుంటాం. కానీ హెటల్స్ లో స్వయంగా అక్కడి వారే మసాలా పొడిని తయారు చేస్తారు. అందుకే టేస్ట్ లో అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది హోటల్ స్టైల్ తందూరి మసాలా పౌడర్ తయారీ గురించే. ఇది చాలా ఘాటుగా, మంచి వాసనతో ఉంటుంది. కేవలం తందూరి వంటకాల్లోనే కాదు.. బిర్యానీ, ఇతర నాన్ వెజ్ వంటకాల్లో కూడా వాడుకోవచ్చు. తందూరి మసాలాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ? అందుకు ఏయే పదార్థాలు కావాలో తెలుసుకుందాం.
తందూరి మసాలా తయారీకి కావలసిన పదార్థాలు
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
సోంపు గింజలు – 1 టీ స్పూన్
బిర్యానీ ఆకు – 1
ఎండుమిర్చి – 10 -12
దాల్చిన చెక్క – 6 ఇంచుల ముక్కలు
లవంగాలు – 1 టీ స్పూన్
యాలకులు – 15 -18
అనాస పువ్వులు -2
మిరియాలు – 2
జాపత్రి -1
శొంఠి ముక్కలు -1 టీస్పూన్
కసూరి మేతి – 1 టీస్పూన్
డ్రై మ్యాంగో పౌడర్ – 1 టీ స్పూన్
తందూరి మసాలా పౌడర్ తయారీ విధానం
స్టవ్ పై కళాయి పెట్టి అందులో.. ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, బిర్యానీ ఆకులను ముక్కలుగా చేసుకుని వేసి కొద్దిగా వేయించాలి. వీటిని ఒక ప్లేట్ లో తీసుకుని పక్కనపెట్టుకోవాలి. అదే కళాయిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, మిరియాలు, జాపత్రి వేసి దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని.. అందులోని శొంఠి, డ్రై మ్యాంగో పౌడర్, కసూరి మేతి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాజు సీసాలో వేసుకుని గాలి తగలకుండా ఉంచుకోవాలి. ఈ తందూరి మసాలాను నాన్ వెజ్ వంటలు, బిర్యానీ తయారీలో వేస్తే.. రుచికి కమ్మగా ఉంటాయి.
Also Read : Weight Loss: బరువు తగ్గడానికి 30-30-30 నియమాన్ని అనుసరించండి.. బెస్ట్ టిప్స్ ఇవే..!
Tags
Related News
Gongura Fish Pulusu : చేపల పులుసు.. గోంగూరతో ఇలా వండితే లొట్టలేసుకుంటూ తింటారు మరి !
సండే అంటే.. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పీతలు.. ఇలా రకరకాల నాన్ వెజ్ వంటలు చేసుకుని తింటారు. చింతపండు పులుసుతో చేపల పులుసు చాలాసార్లు తినే ఉంటారు కదూ. ఫర్ ఏ చేంజ్.. గోంగూరతో చేపల పులుసు ట్రై చేయండి.