Woman Gang Rape: రాజస్థాన్ లో దారుణం.. భర్త ముందే మహిళపై గ్యాంగ్ రేప్.!
రాజస్థాన్ సిరోహి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.
- By Gopichand Published Date - 11:49 AM, Sun - 13 November 22
రాజస్థాన్ సిరోహి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడిన నలుగురు దొంగలు బాధితుడి వద్ద రూ.1400 మాత్రమే ఉండటంతో అతడిని కట్టేసి అతడి కళ్లముందే అతని భార్యపై ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈవిషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో 45 ఏళ్ల మహిళపై ఆమె భర్త ముందే నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులు దోచుకోవాలనే ఉద్దేశంతో దంపతుల ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేతు సింగ్ మాట్లాడుతూ.. మహిళ భర్త వాచ్మెన్గా పనిచేస్తున్నారని చెప్పారు. బుధవారం రాత్రి దంపతులు నిద్రించేందుకు సిద్ధమవుతుండగా నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వారిని బంధించారు. వారి నుండి ఆ నలుగురు వ్యక్తులు రూ.1,400 తీసుకున్నారు. మరింత నగదు, ఇతర విలువైన వస్తువులను డిమాండ్ చేశారు. అయితే కొన్ని వెండి ఆభరణాలు తప్ప దంపతుల వద్ద పెద్దగా ఏమీ లభించలేదు. దింతో దోపిడీదారులు ఆమె భర్త ముందు మహిళపై అత్యాచారం చేశారని సింగ్ పేర్కొన్నారు.
కేసుకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారని, వివిధ స్టేషన్ల సిబ్బంది నిందితులను గుర్తించి వారిని వెతకడంలో నిమగ్నమై ఉన్నారని అధికారి తెలిపారు. వారిలో ముగ్గురిని శనివారం అరెస్టు చేశారు. నాలుగో నిందితుడిని కూడా బృందాలు వెంబడిస్తున్నాయని, అతడిని కూడా పట్టుకుంటామని ఆయన చెప్పారు.
Related News
PM Modi: అంబేడ్కర్ మళ్లీ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు: మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ దేశ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని సోనియా గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.