Salman Rushdie : సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు? ఎందుకీ దాడి!!
భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీ(75)పై జరిగిన దాడి అందరిని షాక్కు గురిచేసింది. ఈ దాడి వల్ల రష్దీ కాలేయం దెబ్బతిందని, ఓ కన్ను కోల్పోయే ముప్పు ఉందని తెలుస్తోంది.
- By Hashtag U Published Date - 04:00 PM, Sun - 14 August 22
భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీ(75)పై జరిగిన దాడి అందరిని షాక్కు గురిచేసింది. ఈ దాడి వల్ల రష్దీ కాలేయం దెబ్బతిందని, ఓ కన్ను కోల్పోయే ముప్పు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రష్దీ వెంటిలేటర్పై ఉన్నారని సమాచారం. న్యూయార్క్లోని చౌతాక్వా ప్రాంతంలో ఉన్న ఓ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన సమావేశానికి సల్మాన్ రష్దీ శుక్రవారం హాజరయ్యారు. ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న క్రమంలోనే.. 24 ఏళ్ల హాది మతార్ అనే యువకుడు వేదికపైకి దూసుకొచ్చి కత్తితో రష్దీపై దాడి చేశాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈనేపథ్యంలో ఎవరీ మతార్? ఎందుకు రష్దీపై దాడి చేశాడు ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వీటికి సమాధానమే ఈ కథనం..
ఎవరు ?
న్యూజెర్సీలో నివసించే హాది మతార్ (24)కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను అమెరికా పోలీసులు పరిశీలించారు. అతడు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (IRGC)కు సానుభూతి పరుడని గుర్తించారు. మతార్కు, ఐఆర్జీసీ మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేవు. అయితే అతడి సెల్ఫోన్లో 2020లో హత్యకు గురైన ఇరాన్ కమాండర్ ఖాసేమ్ సోలేమాని ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. మతార్కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఎందుకు?
రష్దీపై హత్యాయత్నంకు ‘ ది సాటానిక్ వెర్సెస్ ’ పుస్తకమే కారణమన్న వాదన వినిపిస్తోంది. 1988 సంవత్సరంలో రష్దీ ఈ పుస్తకం రాశారు. ఇది రష్దీ నాల్గో పుస్తకం. ఈ నవల ముస్లింలలో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ పుస్తకాన్ని దైవద్రోహంగా కొన్ని దేశాలు ప్రకటించి, నిషేధం విధించాయి. ది సాటానిక్ వెర్సెస్ పుస్తకం రాసినందుకు సల్మాన్ రష్దీపై ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా ఖొమేనీ 1989లో ఫత్వా జారీ చేశాడు. రష్దీని చంపితే 3 మిలియన్ డాలర్లు (రూ. 23.89 కోట్లు) ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా రష్దీని చంపితే 6 లక్షల డాలర్లు (రూ.4.77 కోట్లు) ఇస్తామని 2016లో ఇరాన్ ప్రభుత్వం ప్రకటించినట్లు అక్కడి మీడియా సంస్థల్లో కథనాలు సైతం వచ్చాయి.రష్దీ రచించిన ‘ది సాతానిక్ వెర్సెస్’ నవల వివాదాలకు కేంద్ర బిందువు అయింది. ఆయనకు గతంలోనూ హత్యా బెదిరింపులు వచ్చాయి. 1988 నుంచే ఇరాన్లో ఈ నవలను నిషేధించారు.
Tags
Related News
Salman Rushdie : ప్రముఖ రచయితపై న్యూయార్క్ లో దాడి…!!
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది. ముస్లిం ఛాందసవాదుల నుంచి ఆయన బెదిరింపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది.